Mohan Bhagwat: 75 ఏళ్ల రిటైర్మెంట్పై మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు
- 75 ఏళ్ల రిటైర్మెంట్ ప్రకటనపై మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
- వచ్చే నెలలో మోడీ, భాగవత్కు నిండనున్న 75 ఏళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్లో ఉన్న నాయకులు 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలన్న చర్చ తీవ్రంగా నడుస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్పై చర్చ నడుస్తోంది. తాజాగా దీనిపై మోహన్ భాగవత్ క్లారిటీ ఇచ్చేశారు. తాను గానీ.. మరొకరు గానీ 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని ఎప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం దాదాపు రెండున్నర గంటల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 75 ఏళ్ల పదవీ విరమణపై అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. సెప్టెంబర్లో మోడీ కంటే 6 రోజుల ముందు మోహన్ భాగవత్కు 75 ఏళ్లు నిండనున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: జపాన్ చేరుకున్న మోడీ.. 2 రోజులు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
Also Read
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
తనకు 80 ఏళ్లు నిండినా.. తాను కోరుకున్నా.. లేకపోయినా సంఘ్ కోరుకున్నంత కాలం పని చేస్తానని మోహన్ భాగవత్ వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ కేవలం అయోధ్య రామమందిర ఉద్యమానికే మద్దతు తెలిపిందని.. కాశీ-మథుర ఆలయంతో సహా మరే ఆలయ ఉద్యమానికి మద్దతు ఇవ్వబోదని స్పష్టంచేశారు. మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ వ్యక్తులకు ఉంటుందని.. అయితే ప్రలోభాలు, బలవంతాలు ఉండకూడదన్నారు. అక్రమ వలసదారులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని.. ముస్లింలతో సహా మనవారికి మాత్రమే ఇవ్వాలని తెలిపారు. బీజేపీకి సంబంధించిన ప్రతి విషయాన్నీ ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందన్న భావన పూర్తిగా వాస్తవ విరుద్ధమని భాగవత్ కొట్టిపారేశారు. మతపరమైన దాడుల్ని సంఘ్ సమర్థించదని.. ఇస్లాం ఉండకూడదన్నది హిందూ ఆలోచనా విధానమే కాదన్నారు. భారత్పై అమెరికా 50 శాతం సుంకాలు ఆందోళనకరమని.. అంతర్జాతీయ వాణిజ్యం అవసరమే కానీ ఒత్తిడి కింద స్నేహం సాధ్యం కాదని భాగవత్ క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Off The Record : ఐఏఎస్ శ్రీలక్ష్మిపై భూమన ఆరోపణల వెనుక రహస్యమేంటి?
ఇక 75 ఏళ్ల తర్వాత కూడా మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పష్టం చేశారు. బీజేపీ పని నియమాల్లో వయో పరిమితి లేదని క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?