AAP: బీజేపీలో చేరితే రూ.20 కోట్లు.. చేర్పిస్తే రూ.25కోట్లు.. లేదంటే సీబీఐ దాడులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aam Admi Party: ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని సర్కారు ఢిల్లీలోని కేజ్రీ సర్కారును కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది. ఆప్ ఎమ్మెల్యేలను నగదు, బెదిరింపులతో ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఐదుగురు ఆప్ సీనియర్ నేతలు మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఢిల్లీకి చెందిన తమ ఎమ్మెల్యేలపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. పార్టీ మారకపోతే సీబీఐ దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు ఆరోపించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై మద్యం పాలసీలో అవినీతి జరిగిందని ఇటీవల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడి నేపథ్యంలో పక్కదారి పట్టించడానికి ఆప్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది.
తమ ఎమ్మెల్యేలైన అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్దీప్ కుమార్ను బీజేపీ సంప్రదించిందని ఆప్ జాతీయ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. బీజేపీలో చేరితే ఈ నలుగురికీ రూ.20 కోట్లు చొప్పున ఇస్తామని మాటిచ్చారని చెప్పారు. ఇతర ఎమ్మెల్యేలను కూడా తమతో తీసుకొస్తే రూ.25 కోట్లు ముట్టజెప్తామని బీజేపీ ప్రలోభపెడుతోందని వివరించారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సభ్యులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. “మా ఆఫర్ను ₹ 20 కోట్లు తీసుకోండి లేదా సిసోడియా వంటి సీబీఐ కేసులను ఎదుర్కోండి” అని బెదిరించినట్లు సంజయ్ చెప్పారు. దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కేంద్ర ఏజెన్సీలను మోడీ నేతృత్వంలోని సర్కారు ఎలా ఉపయోగిస్తుందో తాను బహిర్గతం చేస్తాయనని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ఎమ్మెల్యేలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. సిసోడియాపై ఉన్న కేసులు నకిలీవని తమకు తెలుసునని, అయితే ఆప్ని గద్దె దించాలని బీజేపీ సీనియర్ నేతలు నిర్ణయించుకున్నారని, ఆప్ నేతలను చేర్చుకునే బాధ్యతను బీజేపీ నేతలకు అప్పగించారని సోమనాథ్ భారతి అన్నారు. ఏది ఏమైనా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బీజేపీ నేత ఒకరు తనతో అన్నారని వెల్లడించారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
Bihar: బలపరీక్షకు ముందే స్పీకర్ రాజీనామా.. భావోద్వేగ ప్రసంగం అనంతరం..
దీనిపై ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో స్పందించారు. ఇది తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు. సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా కూడా బీజేపీపై తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాణాలైనా ఇస్తారని, అంతేతప్ప పార్టీకి ద్రోహం చేయరని అన్నారు. పార్టీ సభ్యులంతా కేజ్రీవాల్ సైనికులని, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్సింగ్ అనుచరులని చెప్పుకొచ్చారు. తనను పార్టీ నుంచి విడగొట్టే ప్రయత్నాలు విఫలమయ్యాయని.. అందుకే ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపడంతో పాటు సీబీఐ, ఈడీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని సిసోడియా ట్వీట్ చేశారు.
దీనిపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఆప్ ఆరోపణలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. కేజ్రీవాల్ పార్టీ “ట్రైలర్లను” విడుదల చేస్తూనే ఉంటుంది, అయితే “చిత్రం” ఎప్పుడూ రాలేదని అన్నారు. ఢిల్లీ మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలను నుంచి తప్పుకునేందుకు కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!