Lalu Family Crisis: లాలూకు “కిడ్నీ” దానం చేయడం పాపమా.? కుమార్తె రోహిణి సంచలన పోస్ట్..
- బీహార్ ఓటమిలో లాలూ కుటుంబంలో కల్లోలం..
- లాలూకు ‘‘కిడ్నీ’’ ఇవ్వడంపై కుమార్తె భావోద్వేగ పోస్ట్..
- తన కుటుంబంతో సంబంధం లేదని ప్రకటించిన రోహిణి ఆచార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalu Family Crisis: బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీలో దుమారానికి కారణమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో, 243 సీట్లకు గానూ ఎన్డీయే కూటమి 202 సీట్లు సాధిస్తే, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి 35 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆర్జేడీ కేవలం 25 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరాజయంతో ఆర్జేడీ చీఫ్ లాలూ ఇంట్లో తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఇప్పటికే, లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని, రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.
తేజస్వీ యాదవ్ అక్క అయిన రోహిణిపై చెప్పుతో దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, రోహిణి తన ‘‘కిడ్నీ’’ దానం చేసి లాలూ ప్రాణాలు కాపాడిన సంగతిని ఆమె గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2022లో తన తండ్రికి కిడ్నీ దానం చేసి చక్కగా చూసుకున్నందుకు, కొంత మంది ఆమె తండ్రికి ‘‘చెడ్డ కిడ్నీ’’ ఇచ్చిందని, ఎన్నికల్లో టికెట్ కోసం డబ్బు తీసుకున్నదని ఆరోపించినట్లు ఆమె చెప్పింది. 46 ఏళ్ల రోహిణి ఆచార్య ఇలా వరసగా సోషల్ మీడియా పోస్టుల పెట్టడం దేశవ్యాప్తంగా సంచలనమైంది.
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
Read Also: I Bomma Ravi : ఐ బొమ్మ రవికి సోషల్ మీడియాలో మద్దతు.. ఇదేం తీరు భయ్యా..?
ఇప్పటికే, లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, కుటుంబం నుంచి విడిపోయి , సొంత పార్టీ పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా రోహిణి వ్యవహారం లాలూ కుటుంబంలో విభేదాలను వీడిలా పడేలా చేసింది. తన తండ్రికి కిడ్నీ ఇచ్చిన విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ నా ముగ్గురు పిల్లలు, నా భర్త, అత్తమామల అనుమతి తీసుకోకుండా నా దేవుడైన తండ్రిని కాపాడాను. ఇవాళ నా కిడ్నీ చెడ్డదైంది. నా లాంటి తప్పు ఎవరూ చేయకండి, ఎవరికీ ఇలాంటి కూతుళ్లు పుట్టకూడదు’’ అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనను అసభ్యం తిట్టినట్లు, చెప్పుతో దాడి చేయాలని యత్నించినట్లు పేర్కొన్నారు. తన స్వాభిమానం కోసం తాను తలవంచలేదని, నిజం చెప్పడం తప్పా, తాను ఏం చేయలేదని అన్నారు. తనను తన పుట్టింటి నుంచి తోసేశారని, తనను అనాథ చేశారని రోహిణి భావోద్వేగ పోస్టులు చేసింది.
ఈ వివాదంపై బీజేపీ స్పందించింది. రోహిణి తన ప్రాణాలు లెక్కచేయకుండా కిడ్నీ ఇచ్చిందని, లాలూ మాత్రం ఆయన కొడుకుకే ప్రాధాన్యత ఇస్తున్నారని, రోహిణిపై చెప్పులతో దాడి పితృస్వామ్య వ్యవస్థ, మహిళా వ్యతిరేకత, పురుషాధిక్య భావజాలాన్ని చూపిస్తోందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయా అన్నారు. ఆర్జేడీలో కనిపించే అరాచకం ఇప్పుడు కుటుంబంలో కనిపిస్తోందని, ఇలాంటి వారు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
-
Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
-
Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
-
Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!