Prasanna Sankar-Dhivya: “బలవంతంగా సె*క్స్ , ఫ్రెండ్స్తో పడుకోమన్నాడు”.. రిప్లింగ్ దంపతుల కేసులో ట్విస్ట్.
- రిప్లింగ్ ప్రసన్న శంకర్ కేసులో బిగ్ ట్విస్ట్..
- బలవంతంగా సె*క్స్, ఫ్రెండ్స్తో పడుకోవాలని ఒత్తిడి..
- భర్తపై సంచలన ఆరోపణలు చేసిన దివ్యా శశిధర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prasanna Sankar-Dhivya: టెక్ బిలయనీర్, రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్ దంపతులు వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రసన్న శంకర్, అతడి భార్య దివ్యా శశిథర్ కిడ్నా్ప్, లైంగిక వేధింపులు ఇలా పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ప్రసన్న శంకర్ విడాకులు, కొడుకు కస్టడీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. తన భార్య దివ్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ప్రసన్న, దివ్యపై సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి సాక్ష్యాలు, వాట్సాప్ చాటింగ్ కూడా ఉన్నాయని ప్రసన్న సంచలన ఆరోపణలు చేశారు. అనూప్ అనే వ్యక్తితో తన భార్య ఎఫైర్ పెట్టుకున్నట్లు ఆరోపించాడు.
ఇదెలా ఉంటే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దివ్య, ప్రసన్నపై సంచలన ఆరోపణలు చేసింది. దివ్య ది శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్ కు వ్యక్తిగత ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. తన భర్త తనను సెక్స్ కోసం ఎలా బలవంతం చేశాడనే విషయాన్ని చెప్పింది. అతడు వేశ్యలతో సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపించింది. బాత్రూంలో కెమెరాలతో ఎలా నిఘా పెట్టాడనే విషయాన్ని, రోజూవారీ కార్యకలాపాల సమయంలో ఎలా చిత్రీకరించాడనే విషయాన్ని వెల్లడించింది.
Also Read
READ ALSO: Gas Cylinder Price Hike: వంటింట్లో మంట.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
తన సంపదపై పన్నులు పడొద్దని తనను, తన కొడుకును దేశం మరో దేశానికి ఈడ్చుకెళ్లినట్లు వెల్లడించింది. తాను ప్రసవ సమయంలో నొప్పి అనుభవిస్తున్నప్పుడు కూడా తనతో బలవంతంగా సెక్స్ చేశాడని దివ్య చెప్పింది. తన కోరిక తీర్చకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడని, సెక్స్ నాకు ప్రాథమిక అవసరమని చెప్పాడని తెలిపింది. ఒక వేళ నాతో నువ్వు శృంగారంలో పాల్గొనకుంటే, నేను బయటకు వెళ్లి దానిని పొందాలనుకుంటున్నట్లు చెప్పేవాడని వెల్లడించింది.
ప్రస్తుతం వీరి కేసు కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది. కోర్టుకు దివ్య ఇచ్చిన వాంగ్మూలంలో, తన భర్తతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఉద్యోగం మానేయాలని బలవంతం చేసేవాడని, లేకుంటే ఇతర భాగస్వాములను చూసుకుంటా అని బెదిరించేవాడని ఆరోపించింది. అంతే కాకుండా తన స్నేహితులతో పడుకోవాలని ఒత్తిడి చేసేవాడని దివ్య కోర్టుకు తెలిపింది. అనూప్తో తనకు ఉన్న సంబంధం గురించి ప్రసన్న చెప్పేవి అన్ని కల్పితమైనవే అని, అతడితో తన సంబంధం లైంగికమైనది కాదని, భావోద్వేగమైనదని ఆమె న్యాయవాదులు కోర్టులో తెలిపారు.
ప్రసన్న శంకర్, దివ్య తొలిసారిగా 2007లో కలుసుకున్నారు. 2013లో వీరు వివాహం చేసుకున్నారు. 2017లో ప్రసన్న శంకర్ తన స్టార్టప్ రిప్లింగ్ని స్థాపించాడు. 2022 నాటికి శంకర్ బిలియనీర్ హోదాను ఫోర్బ్స్ గుర్తించింది. ప్రస్తుతం రిప్లింగ్ వాటాలో 9 శాతం కలిగి ఉన్నాడు. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రసన్న శంకర్, దివ్యల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. భరణం కింద తనకు నెలకు రూ. 9 కోట్ల రూపాయలు ఇవ్వాలని దివ్య డిమాడ్ చేసింది.
తాజావార్తలు
-
AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
ట్రెండింగ్
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!