Waqf Bill: నితీష్ కుమార్ పార్టీలో ‘వక్ఫ్ బిల్లు’ కల్లోలం.. రెండుగా చీలిన నేతలు..
- జేడీయూలో వక్ఫ్ బిల్లు కల్లోలం..
- బిల్లుపై రెండుగా చీలిన నేతలు..
- అంతర్గత విభేదాలపై నితీష్ కుమార్ సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Bill: వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాల’కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చింది. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో, జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ ఈ బిల్లుకు లోక్సభలో మద్దతు ప్రకటించింది. కాగా, క్షేత్రస్థాయిలో మాత్రం నితీష్ కుమార్కి చెందిన జేడీయూ పార్టీలో ‘వక్ఫ్ బిల్లు’ చీలికలువ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుపై పార్టీ నేతలు రెండుగా చీలిపోయారు.
Read Also: Japan: జపనీయులను వెంటాడుతున్న సునామీ భయం.. వెలవెలబోతున్న షాపింగ్ మాల్స్
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఇటీవల బిల్లుకు జేడీయూ ఎంపీ, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మద్దతు తెలిపారు. ఇది వక్ఫ్ బోర్డుల పనితీరులో పారదర్శకతను తీసుకురావడానికి తెచ్చిన బిల్లుగా పేర్కొన్నారు. ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదని అన్నారు. ఈ బిల్లు మసీదు లేదా దేవాలయానికి సంబంధించింది కాదని, వక్ఫ్ బోర్డుల పారదర్శకతను ప్రోత్సహించడానికి తెచ్చినదని చెప్పారు. అయితే, రంజన్ సింగ్ వ్యాఖ్యలపై జేడీయూ నేత, మాజీ ఎమ్మెల్సీ గులాం గౌస్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 7 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న వక్ఫ్ బోర్డు భూములను స్వాధీనం చేసుకునేందుకు ఈ బిల్లు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా బీజేపీ ఈ బిల్లుని తీసుకువచ్చిందని అన్నారు. వక్ఫ్ భూముల్ని లాక్కోవడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు.
మరో జేడీయూ నేత, ముఖ్యమంత్రి కీలక సహాయకుడు విజయ్ కుమార్ చౌదరి వక్ఫ్ బిల్లును జేపీసీకి పంపాలన్న కేంద్ర నిర్ణయాన్ని ప్రశంసించారు. మైనారిటీ కమ్యూనిటీలో ఈ బిల్లుపై భయాలు ఉన్నాయని, అయితే జేపీసీ పరిశీలనకు పంపాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. మైనారిటీ వర్గాలకు సంబంధించిన సమస్యలను అత్యంత సున్నితత్వంతో పరిష్కరించాలని మా నేత నితీష్ కుమార్ నమ్ముతారని అన్నారు. అయితే, పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు నితీస్ కుమార్ పార్టీ నేతలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..