RG Kar Hospital: సీబీఐ కస్టడీలో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఎలా గడిపారంటే..!
- సీబీఐ కస్టడీలో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్
- తొలి రోజు నిద్రలేకుండానే గడిపిన మాజీ ప్రిన్సిపాల్
- విచారణలో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. అనంతరం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఇక ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను ఎనిమిది రోజులు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది.
ఇది కూడా చదవండి: Crime: దారుణం.. పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో మాజీ సైనికుడిని కొట్టి చంపిన మనవడు
Also Read
సందీప్ ఘోష్ను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. అయితే తొలి రోజు రాత్రి సందీప్ ఘోష్ నిద్రలేని రాత్రి గడిపినట్లుగా తెలుస్తోంది. శాఖాహారం తినాలని డిమాండ్ చేసినట్లుగా వర్గాలు తెలిపాయి. విచారణలో సందీప్ ఘోష్ తన ప్రమేయం లేదని చెప్పినట్లుగా సమాచారం. ఉత్కంఠ, విరామం లేకుండా రాత్రంతా మేల్కొని గడిపినట్లుగా దర్యాప్తు వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కోల్కతాలోని నిజాం ప్యాలెస్లోని రెండవ ఎంఎస్వో భవనంలోని 14వ అంతస్తులో ఘోష్ లాకప్కు పరిమితమయ్యారు. లాకప్ లోపల, వెలుపల నలుగురు సాయుధ సీఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 10న మళ్లీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇంకా కస్టడీలో ఏడు రోజుల పాటు ఉండనున్నారు. కస్టడీలోనో.. జైల్లోనో ఎప్పుడూ గడపని వ్యక్తి సర్దుకుపోవడానికి సమయం తీసుకోవడం సహజం అని అధికారులు చెప్పారు.
ఇది కూడా చదవండి: Onion Price: భారీగా పెరిగిన ఉల్లి ధర?.. కారణం ఇదే
మంగళవారం ఘోష్ను కోర్టు నుంచి తీసుకెళ్తుండగా రెచ్చిపోయిన గుంపు అతనిపై దాడికి యత్నించింది. CRPF, కోల్కతా పోలీసుల గట్టి భద్రత ఉన్నప్పటికీ ఘోష్ను సీబీఐ వాహనం దగ్గరకు తీసుకువెళుతుండగా గుంపులోని సభ్యుడు ఘోష్ను చెంపదెబ్బ కొట్టాడు. సోమవారం అరెస్టు అయిన వెంటనే.. ఘోష్ కాళీ పూజను పాటిస్తూ శాఖాహార భోజనాన్ని అభ్యర్థించాడు. కోల్కతాలోని బెలియాఘాటాలోని తన నివాసానికి సమీపంలో ఉన్న బాలాజీ ఆలయానికి సాధారణ సందర్శకుడిగా ఘోష్ వెళ్తుంటారు. ఘోష్ అభ్యర్థన మేరకు శాఖాహారాన్ని అందించారు. ఘోష్తో పాటు మరో ముగ్గురు నిందితులకు వైద్యుల బృందం వైద్య పరీక్షలు చేసింది. మంగళవారం కోర్టు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఘోష్ చాలా మౌనంగా ఉన్నారని వర్గాలు తెలిపాయి. బుధవారం ఉదయం ఆయనకు టీ, బిస్కెట్లు, అల్పాహారం అందించారు. సీబీఐ అవినీతి నిరోధక శాఖకు చెందిన ముగ్గురు అధికారుల నేతృత్వంలో బుధవారం ఉదయం విచారణ ప్రారంభమైంది. కొద్దిసేపు భోజన విరామం తర్వాత తిరిగి కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఎలాంటి ప్రమేయం లేదని ఘోష్ ఖండించారు .
సందీప్ ఘోష్ ఫిబ్రవరి 2021 నుంచి సెప్టెంబరు 2023 వరకు హాస్పిటల్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. అక్టోబర్ 2023లో బదిలీ చేయబడినప్పటికీ అతను ఒక నెలలోపు తన స్థానానికి తిరిగి రాగలిగాడు. ఆగస్టు 9న ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం జరిగినప్పుడు ఘోష్ ప్రిన్సిపాల్గా ఉన్నాడు.
ఇది కూడా చదవండి: Nigeria: మరణించిన ఏడాదికి నైజీరియా ఫ్లాగ్ డిజైనర్ అంత్యక్రియలు
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!