Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Bhagwat: రాష్ట్రీక స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో వివక్ష ఉందని, అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలని బుధవారం ఆయన అన్నారు. నాగ్పూర్లో జరిగిన ఓ సమావేశం ఆయన మాట్లాడారు. 1947లో భారతదేశంతో విడిపోయిన వారు తాము తప్పు చేస్తున్నామని భావిస్తున్న తరుణంలో నేటి యువకులు వృద్ధులుగా మారకముందే ‘అఖండ భారత్’, అవిభాజ్య భారతదేశం సాకారం అవుతుందని ఆయన అన్నారు.
రిజర్వేషన్ల కోసం మరాఠా కమ్యూనిటీ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతం కొన్ని రోజులుగా మరాఠా కమ్యూనిటీ మహారాష్ట్రలో ఉద్యమం చేస్తున్నారు. మోహన్ భగవత్ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ.. మనం సాంఘిక వ్యవస్థలో మా తోటి మనుషులను వెనక ఉంచామని, మనం వారిని పట్టించుకోలేదని, 2000 ఏళ్ల పాటు ఇది కొనసాగిందని, సమానత్వం మనం తీసుకుంటున్న చర్యల్లో రిజర్వేషన్లు ఒకటని, అటు వంటి వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాలని, ఆర్ఎస్ఎస్ దానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: IND vs PAK: భారీ స్కోర్ సాధిస్తాం.. పాకిస్థాన్ పేసర్లను హెచ్చరించిన భారత్!
మన సమాజంలో ఇప్పటికీ వివక్ష ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని నిర్థారించడమే కాకుండా.. గౌరవాన్ని ఇవ్వడమే అని ఆయన అన్నారు. వివక్ష ఎదుర్కొంటున్న వారు 2000 ఏళ్లు బాధపడుతుంటే.. వివక్ష ఎదుర్కోని వాళ్లు మరో 200 ఏళ్లు ఎందుకు ఇబ్బందులను అంగీకరించము..? అని ప్రశ్నించారు. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అఖండ భారత్ ఎప్పుడు ఉనికిలోకి వస్తుందో చెప్పలేమని తెలిపారు.
1950 నుంచి 2002 వరకు నాగ్పూర్ మహల్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరేయలేదనే ఆరోపణపై స్పందిస్తూ.. ప్రతీ ఏడాది ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో జాతీయ జెండాను ఎగరేస్తున్నామని అన్నారు. 1933లో జల్గావ్ ప్రాంతంలో జరిగిన కాంగ్రెస్ తేజ్పూర్ సమావేశంలో జవహర్ లాల్ నెహ్రూ 80 అడుగుల స్తంభంపై జాతీయ జెండాను ఎగరేసిన సంఘటనను గుర్తు చేశారు. ఆ సమయంలో జెండా ఇరుక్కుపోతే ఓ యువకుడు స్తంభాన్ని ఎక్కి సరిచేసిన ఘటనను గుర్తు చేశారు. సుమారు 10,000 మందిలో ఓ యువకుడు ఈ సాహసం చేశాడని.. మరుసటి రోజు నెహ్రూ అతడిని సమావేశానికి హాజరు కావాలని కోరారు, అయితే ఆ యువకుడు ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్తాడని చెప్పడంతో అది జరగలేదని భగవత్ అన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆ యువకుడి ఇంటికి వెళ్లి ప్రశంసించారని చెప్పారు. ఆ యువకుడి పేరు కిషన్ సింగ్ రాజ్పుత్ అని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!