Article 370 hearing: జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధం.. సుప్రీంకు తెలిపిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Article 370 hearing: జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్ , సూర్యకాంత్లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370 పిటిషన్ ను విచారిస్తోంది.
జమ్మూకాశ్మీర్ లో ఎప్పుడైనా ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు ఈ రోజు తెలిపింది. అయితే ఈ నిర్ణయం ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానిదే అని ప్రభుత్వం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని ఇతర రాష్ట్రాలతో పోల్చలేమని, విభజన అవసరమని గతంలో కేంద్రం వాదించింది. మంగళవారం జరిగిన విచారణలో, జూన్ 2018 నుంచి జమ్మూ కాశ్మీర్ లో ఎన్నుకోబడిన ప్రభుత్వం లేకుండా ఉందని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ఇదిలా ఉంటే రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించి నిర్ధిష్ట గడవు ఇవ్వలేమని కేంద్రం, సుప్రీంకోర్టుకు తెలిపింది.
Also Read
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
Read Also: Ramya Krishna : నేటి తరం హీరోయిన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రమ్య కృష్ణ..
ఈ రోజు జరిగిన విచారణలో 2018 నుంచి 2023తో పోలిస్తే ఉగ్రవాద కేసులు 45.2 శాతం తగ్గాయని, చొరబాట్లు 90 శాతం తగ్గాయని కేంద్రం, సుప్రీం కోర్టుకు తెలియజేసింది. రాళ్ల దాడులు, లా అండ్ ఆర్డర్ సమస్యలు 97 శాతం తగ్గాయని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు తెలియజేశారు. భద్రత సిబ్బంది ప్రమాదాలు 65 శాతం తగ్గాయని, 2018లో రాళ్ల దాడులకు సంబంధించిన కేసులు 1767 నమోదైతే ఇప్పుడు అది శూన్యానికి చేరుకుందని, 2018లో 52 సార్లు బందులు ఉంటే ఇప్పుడు బంద్లు లేవని తెలియజేశారు.
2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, తగిన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్రం చెప్పింది. హోంమంత్రి అమిత్ షా కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు కానీ అలాంటి చర్యకు ఎలాంటి గడువు విధించలేదు.
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!