Ramya Krishna : నేటి తరం హీరోయిన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రమ్య కృష్ణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రమ్య కృష్ణ.. ఈ సీనియర్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్స్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు, అలాగే తమిళ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.ప్రస్తుతం రమ్యకృష్ణ పలు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా లో శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ.ఒకప్పుడు రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్ గా తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించారు… అలాగే తన అందం తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. రమ్యకృష్ణ దాదాపు తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించారు.రీసెంట్ గా ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ భార్యగా కనిపించారు రమ్యకృష్ణ.
ఇదిలా ఉంటే తాజాగా రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అటు ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారాయి. నేటి తరం హీరోయిన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు రమ్యకృష్ణ.ఒకప్పుడు హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాల్లో అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం ఇలా కాదు. ఒక్క సినిమా సక్సెస్ అయితే వరుసగా నాలుగు, ఐదు సినిమాల్లో ఛాన్స్ లు వస్తున్నాయి అని అన్నారు రమ్యకృష్ణ. మేము ఏళ్ల తరబడి హీరోయిన్స్ గా కొనసాగాము.. ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ 25 ఏళ్ల వరకు కెరీర్ కంటిన్యూ చేయలేకపోతున్నారని ఆమె అన్నారు.అప్పట్లో మేము అనుకోకుండా కొన్ని తప్పులు చేసిన వాటిని కరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అలా అయితే లేదు. మేము ఎన్నో ఏళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బును ఇప్పటి హీరోయిన్స్ అతి తక్కువ సమయంలోనే సంపాదిస్తున్నారు. అయితే టైమ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ కూడా ఊహించలేరు అని తెలిపారు. ప్రస్తుతం రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
తాజావార్తలు
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!