Ram Madhav: యుద్ధ భూమి నుంచి తప్పుకుంటే ఏ పార్టీకి మనుగడ ఉండదు.. పీకేపై రామ్ మాధవ్ విసుర్లు
- ప్రశాంత్ కిషోర్పై రామ్ మాధవ్ విసుర్లు
- యుద్ధ భూమి నుంచి పారిపోయారు
- అలాంటి పార్టీలు మనుగడ సాధించలేవు
- రాహుల్ గాంధీని ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యుద్ధ భూమి నుంచి తప్పుకుంటే ఏ పార్టీకి మనుగడ ఉండదని ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్ అన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పని తీరుపై రామ్ మాధవ్ విమర్శలు గుప్పించారు. జన్ సురాజ్ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదని.. ప్రశాంత్ కిషోర్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలియడం లేదన్నారు. ఏ నాయకుడైనా యుద్ధ భూమి నుంచి పారిపోతే.. ఏ పార్టీ అయినా ఎలా మనుగడ సాధిస్తుందని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Hong Kong fire: 94కు చేరిన అగ్నిప్రమాద మరణాలు.. పలువురు ఆచూకీ గల్లంతు
Also Read
- TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
- DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
- Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
ఇక రాహుల్ గాంధీని ఎవరూ కూడా సీరియస్గా తీసుకోరని.. అలాగే ఓట్ చోర్ వ్యవహారాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ పట్టించుకుంటే ఫలితాలు వేరేలా ఉండేవని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సీరియస్ లేని నాయకుడు.. ఆయన ఎప్పుడూ చట్టబద్ధమైన కార్యక్రమాల్లో పాల్గొనరని విమర్శించారు. ఎన్నికల ఫలితాలను బట్టి రాహుల్ మాటలను బీహారీయులు నమ్మలేదని అర్థమవుతుందన్నారు.
ఇది కూడా చదవండి: Bihar Video: నడిరోడ్డుపై ఆకతాయి స్టంట్లు.. హడలెత్తిపోయిన విద్యార్థినులు
‘SIR’ అనేది ఎన్నికల సంఘానికి సంబంధించిదని.. అంతే తప్ప ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు. నకిలీ ఓటర్లను తొలగించడానికి ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలను సమీక్షించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రక్రియ బీహార్లో విజయవంతంగా పూర్తయిందని.. 65 లక్షల మంది ఎంట్రీలు నకిలీలు, బోగస్ ఎంట్రీలు అని తేలిందని చెప్పారు. నిజమైన ఓటర్ల పేర్లు ఎక్కడికి పోవని తెలిపారు. ఇక ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశం వెలుపల పని చేయదని తేల్చి చెప్పారు. ఆర్ఎస్ఎస్లో ఉండే ప్రతి పైసా ఆడిట్ అవుతుందని వివరించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 202 స్థానాలు గెలుచుకుంది. నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
#WATCH | Speaking on Bihar Assembly elections 2025 and on Prashant Kishor's performance, in an interview with ANI, Senior RSS leader Ram Madhav says, "I don't want to comment on the Jan Suraj party phenomenon. I never understood the logic behind PK trying to form a party and then… pic.twitter.com/mRgyxbUDWB
— ANI (@ANI) November 28, 2025
#WATCH | In an interview with ANI, Senior RSS leader Ram Madhav says, "Who takes Rahul Gandhi too seriously nowadays? He makes all sorts of criticisms about everything. Nobody took his 'Vote Chori' campaign seriously. If people had taken it seriously, Bihar would not have seen… pic.twitter.com/GXKVQge2xc
— ANI (@ANI) November 28, 2025
#WATCH | On being asked about reports of RSS lobbying in the US, Senior RSS leader Ram Madhav says in an interview with ANI, "The RSS has categorically denied that it has employed any lobbying agency in America… But lobbying, per se, in America is not a crime. Lobbying in the… pic.twitter.com/zUNfJBTsnI
— ANI (@ANI) November 28, 2025
#WATCH | On the Delhi terror blast and Faridabad terror module case, Senior RSS leader Ram Madhav says in an interview with ANI, "There are so many myths and illusions about terrorism. The Red Fort incident has shattered several of them. Globally, the perception is that education… pic.twitter.com/apyTV9kFCT
— ANI (@ANI) November 28, 2025
తాజావార్తలు
-
TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
-
Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
-
Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
-
DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!