SCO Meeting: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనా రక్షణ మంత్రితో చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh holds talks with Chinese defence minister: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సమావేశం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్ఫుతో గురువారం చర్చలు జరిపారు. 2020లో గాల్వాన్ లో భారత్-చైనా సైన్యం మధ్య ఘర్షణ అనంతరం చైనా రక్షణ మంత్రితో చర్చల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ఇరుదేశాల రక్షణ మంత్రులు సమావేశం నిర్వహించారు. కజకిస్థాన్, ఇరాన్, తజికిస్థాన్ రక్షణ మంత్రులతో రాజ్నాథ్ సింగ్ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించారు.
Read Also: Bandi Sanjay : బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేసిన కోర్టు
Also Read
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
గత ఆదివారం భారత్, చైనా మధ్య 18వ రౌండ్ కార్ప్స్ కమాండర్-స్థాయి చర్చలు జరిగాయి, రెండు దేశాలు సన్నిహితంగా ఉండటానికి మరియు తూర్పు లడఖ్లోని మిగిలిన సమస్యలను పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని త్వరగా రూపొందించడానికి అంగీకరించాయి. అయితే మూడేళ్లుగా ఉణ్న సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలకడంపై స్పష్టంగా ముందుకు వెళ్లే సూచనలు కనిపించడం లేదు.
మే 5, 2020న తూర్పు లడఖ్ సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య భీకరదాడులు జరిగాయి. ఈ ఘర్షణల్లో భారత్ నుంచి 20 మంది సైనికులు వీరమరణం పొందారు. అయితే భారత్ సైనికులు తిరిగి జరిపిన దాడిలో 40 మందికి పైగా చైనా సైనికులు మరణించినట్లు అమెరికాతో పాటు పాశ్చాత్యదేశాలు వెల్లడించాయి. అయితే డ్రాగన్ కంట్రీ చైనా మాత్రం తమవారు నలుగురు సైనికులు మాత్రమే చనిపోయినట్లు చెబుతోంది. చైనా లఢఖ్ ప్రాంతంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తరుచుగా భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. గతేడాది చైనా సైనికులు తవాంగ్ సెక్టార్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సమయంలో భారత సైనికలు వారిని తరిమికొట్టారు.
తాజావార్తలు
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!