SCO Meeting: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనా రక్షణ మంత్రితో చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh holds talks with Chinese defence minister: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సమావేశం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్ఫుతో గురువారం చర్చలు జరిపారు. 2020లో గాల్వాన్ లో భారత్-చైనా సైన్యం మధ్య ఘర్షణ అనంతరం చైనా రక్షణ మంత్రితో చర్చల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ఇరుదేశాల రక్షణ మంత్రులు సమావేశం నిర్వహించారు. కజకిస్థాన్, ఇరాన్, తజికిస్థాన్ రక్షణ మంత్రులతో రాజ్నాథ్ సింగ్ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించారు.
Read Also: Bandi Sanjay : బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేసిన కోర్టు
Also Read
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
- PM Modi: న్యూజిలాండ్లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
- INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్కు మరో మైలురాయి
గత ఆదివారం భారత్, చైనా మధ్య 18వ రౌండ్ కార్ప్స్ కమాండర్-స్థాయి చర్చలు జరిగాయి, రెండు దేశాలు సన్నిహితంగా ఉండటానికి మరియు తూర్పు లడఖ్లోని మిగిలిన సమస్యలను పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని త్వరగా రూపొందించడానికి అంగీకరించాయి. అయితే మూడేళ్లుగా ఉణ్న సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలకడంపై స్పష్టంగా ముందుకు వెళ్లే సూచనలు కనిపించడం లేదు.
మే 5, 2020న తూర్పు లడఖ్ సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య భీకరదాడులు జరిగాయి. ఈ ఘర్షణల్లో భారత్ నుంచి 20 మంది సైనికులు వీరమరణం పొందారు. అయితే భారత్ సైనికులు తిరిగి జరిపిన దాడిలో 40 మందికి పైగా చైనా సైనికులు మరణించినట్లు అమెరికాతో పాటు పాశ్చాత్యదేశాలు వెల్లడించాయి. అయితే డ్రాగన్ కంట్రీ చైనా మాత్రం తమవారు నలుగురు సైనికులు మాత్రమే చనిపోయినట్లు చెబుతోంది. చైనా లఢఖ్ ప్రాంతంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తరుచుగా భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. గతేడాది చైనా సైనికులు తవాంగ్ సెక్టార్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సమయంలో భారత సైనికలు వారిని తరిమికొట్టారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
-
Jaipur Murder: ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చంపింది.!
-
Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
-
PM Modi: న్యూజిలాండ్లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!