Rajiv Kumar: రిటైర్మెంట్ తర్వాత ఏకాంతం కోసం అక్కడికి వెళ్తా
- రిటైర్మెంట్ తర్వాత ఏకాంతం కోసం హిమాలయాలకు వెళ్తా
- ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్న రాజీవ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ త్వరలో రిటైర్మెంట్ కానున్నారు. మంగళవారం చివరి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలే ఆయన చివరి ప్రెస్మీట్ కావడం విశేషం. మే 15, 2022న 25వ సీఈసీగా బాధ్యతలు స్వీకరించారు.
ఇది కూడా చదవండి: Saudi Arabia: మక్కా, మదీనాను ముంచెత్తిన వర్షాలు.. సౌదీ వీడియోలు వైరల్..
Also Read
- Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
- AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
- CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
- IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
ఇదిలా ఉంటే రిటైర్మెంట్ తర్వాత ఏం చేయబోతున్నారో రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పదవీ విరమణ తర్వాత హిమాలయాల్లో అనేక నెలల పాటు ఏకాంతంగా గడపాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. తనకు కొంత ఏకాంతం, స్వీయ అధ్యయనం అవసరం అని తెలిపారు. రాజీవ్ కుమార్.. బీహార్/జార్ఖండ్ కేడర్కు చెందిన 1984-బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పేద పిల్లలకు బోధించడం ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలనే వ్యక్తిగత కోరిక ఉన్నట్లు తెలిపారు. మునిసిపల్ పాఠశాలలో విద్యాభాస్యాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చెట్టు కింద తరగతులు జరిగినట్లుగా గుర్తుచేశారు. 6వ తరగతిలో ఏబీసీడీలు నేర్చుకోవడం మొదలుపెట్టినట్లు తెలిపారు. స్లేట్ తీసుకుని చెట్టుకింద కూర్చున్నట్లు చెప్పారు. తిరిగి మూలాల్లోకి వెళ్లి పిల్లలకు పాఠాలు నేర్పించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mumbai Indians IPL 2025: కొత్త ఫీల్డింగ్ కోచ్ని ప్రకటించిన ముంబై ఇండియన్స్
రాజీవ్ పదవీ కాలంలో 2022లో 16వ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు 11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ఒక మైలురాయి. ఇక ఎన్నికల కమిషనర్గా రాకముందు ఫైనాన్స్ సెక్రటరీ మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ ఛైర్మన్తో సహా అనేక కీలక పదవులు నిర్వహించారు. ఆర్థిక కార్యదర్శిగా బ్యాంకుల విలీనాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనీకరణ మరియు షెల్ కంపెనీలపై అణిచివేత వంటి ముఖ్యమైన సంస్కరణలకు నాయకత్వం వహించారు.
ఇది కూడా చదవండి: Naga Vamsi: ఊర్వశిని కొట్టింది నేనా.. బాలయ్యే కొట్టాడు.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!