Rajiv Kumar: రిటైర్మెంట్ తర్వాత ఏకాంతం కోసం అక్కడికి వెళ్తా
- రిటైర్మెంట్ తర్వాత ఏకాంతం కోసం హిమాలయాలకు వెళ్తా
- ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్న రాజీవ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ త్వరలో రిటైర్మెంట్ కానున్నారు. మంగళవారం చివరి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలే ఆయన చివరి ప్రెస్మీట్ కావడం విశేషం. మే 15, 2022న 25వ సీఈసీగా బాధ్యతలు స్వీకరించారు.
ఇది కూడా చదవండి: Saudi Arabia: మక్కా, మదీనాను ముంచెత్తిన వర్షాలు.. సౌదీ వీడియోలు వైరల్..
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ఇదిలా ఉంటే రిటైర్మెంట్ తర్వాత ఏం చేయబోతున్నారో రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పదవీ విరమణ తర్వాత హిమాలయాల్లో అనేక నెలల పాటు ఏకాంతంగా గడపాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. తనకు కొంత ఏకాంతం, స్వీయ అధ్యయనం అవసరం అని తెలిపారు. రాజీవ్ కుమార్.. బీహార్/జార్ఖండ్ కేడర్కు చెందిన 1984-బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పేద పిల్లలకు బోధించడం ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలనే వ్యక్తిగత కోరిక ఉన్నట్లు తెలిపారు. మునిసిపల్ పాఠశాలలో విద్యాభాస్యాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చెట్టు కింద తరగతులు జరిగినట్లుగా గుర్తుచేశారు. 6వ తరగతిలో ఏబీసీడీలు నేర్చుకోవడం మొదలుపెట్టినట్లు తెలిపారు. స్లేట్ తీసుకుని చెట్టుకింద కూర్చున్నట్లు చెప్పారు. తిరిగి మూలాల్లోకి వెళ్లి పిల్లలకు పాఠాలు నేర్పించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mumbai Indians IPL 2025: కొత్త ఫీల్డింగ్ కోచ్ని ప్రకటించిన ముంబై ఇండియన్స్
రాజీవ్ పదవీ కాలంలో 2022లో 16వ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు 11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ఒక మైలురాయి. ఇక ఎన్నికల కమిషనర్గా రాకముందు ఫైనాన్స్ సెక్రటరీ మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ ఛైర్మన్తో సహా అనేక కీలక పదవులు నిర్వహించారు. ఆర్థిక కార్యదర్శిగా బ్యాంకుల విలీనాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనీకరణ మరియు షెల్ కంపెనీలపై అణిచివేత వంటి ముఖ్యమైన సంస్కరణలకు నాయకత్వం వహించారు.
ఇది కూడా చదవండి: Naga Vamsi: ఊర్వశిని కొట్టింది నేనా.. బాలయ్యే కొట్టాడు.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!