Rajiv Kumar: రిటైర్మెంట్ తర్వాత ఏకాంతం కోసం అక్కడికి వెళ్తా
- రిటైర్మెంట్ తర్వాత ఏకాంతం కోసం హిమాలయాలకు వెళ్తా
- ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్న రాజీవ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ త్వరలో రిటైర్మెంట్ కానున్నారు. మంగళవారం చివరి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలే ఆయన చివరి ప్రెస్మీట్ కావడం విశేషం. మే 15, 2022న 25వ సీఈసీగా బాధ్యతలు స్వీకరించారు.
ఇది కూడా చదవండి: Saudi Arabia: మక్కా, మదీనాను ముంచెత్తిన వర్షాలు.. సౌదీ వీడియోలు వైరల్..
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
ఇదిలా ఉంటే రిటైర్మెంట్ తర్వాత ఏం చేయబోతున్నారో రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పదవీ విరమణ తర్వాత హిమాలయాల్లో అనేక నెలల పాటు ఏకాంతంగా గడపాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. తనకు కొంత ఏకాంతం, స్వీయ అధ్యయనం అవసరం అని తెలిపారు. రాజీవ్ కుమార్.. బీహార్/జార్ఖండ్ కేడర్కు చెందిన 1984-బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పేద పిల్లలకు బోధించడం ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలనే వ్యక్తిగత కోరిక ఉన్నట్లు తెలిపారు. మునిసిపల్ పాఠశాలలో విద్యాభాస్యాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చెట్టు కింద తరగతులు జరిగినట్లుగా గుర్తుచేశారు. 6వ తరగతిలో ఏబీసీడీలు నేర్చుకోవడం మొదలుపెట్టినట్లు తెలిపారు. స్లేట్ తీసుకుని చెట్టుకింద కూర్చున్నట్లు చెప్పారు. తిరిగి మూలాల్లోకి వెళ్లి పిల్లలకు పాఠాలు నేర్పించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mumbai Indians IPL 2025: కొత్త ఫీల్డింగ్ కోచ్ని ప్రకటించిన ముంబై ఇండియన్స్
రాజీవ్ పదవీ కాలంలో 2022లో 16వ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు 11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ఒక మైలురాయి. ఇక ఎన్నికల కమిషనర్గా రాకముందు ఫైనాన్స్ సెక్రటరీ మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ ఛైర్మన్తో సహా అనేక కీలక పదవులు నిర్వహించారు. ఆర్థిక కార్యదర్శిగా బ్యాంకుల విలీనాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనీకరణ మరియు షెల్ కంపెనీలపై అణిచివేత వంటి ముఖ్యమైన సంస్కరణలకు నాయకత్వం వహించారు.
ఇది కూడా చదవండి: Naga Vamsi: ఊర్వశిని కొట్టింది నేనా.. బాలయ్యే కొట్టాడు.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!