రాజస్థాన్ రాజకీయం… మంత్రులంతా రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కేబినెట్ మొత్తాన్ని పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేబినెట్ మంత్రులంతా శనివారం రాజీనామా చేశారు. మంత్రుల నుంచి రాజీనామా పత్రాలను సీఎం అశోక్ గెహ్లాట్ సేకరించి.. మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. ఆదివారం సాయంత్రం కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో తొలుత ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ సమావేశాన్ని కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్నారు. మరోవైపు మంత్రుల రాజీనామా అనంతరం సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం రాత్రి గవర్నర్ నివాసానికి వెళ్లారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చించారు.
Read Also: గుండెలను పిండేస్తున్న బాలిక సూసైడ్ నోట్.. ఏం రాసిందంటే..?
Also Read
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
రాజస్థాన్లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా నూతన మంత్రుల నియామకం కోసం కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తులు ప్రారంభించింది. ఈ మేరకు ఆదివారం నాడు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం కొత్త మంత్రుల జాబితాను రాజస్థాన్ ప్రభుత్వానికి పంపనుంది. ప్రస్తుతం రాజస్థాన్ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సభ్యుల ప్రకారం.. గరిష్టంగా 30 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. కొత్త జాబితా వచ్చిన అనంతరం ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. గతంలో హైకమాండ్ ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలో సచిన్ పైలట్ కు స్థానం దక్కే అవకాశముంది. ఇప్పటికే నూతన కేబినెట్ అంశంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా సీఎం అశోక్ గెహ్లాట్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్గా ఎలా మారింది?
ట్రెండింగ్
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!