Raj thackeray: ముస్లింలు గమనించాలి… చట్టం కంటే మతం పెద్దది కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రార్థనల సమయంలో మసీదుల్లో లౌడ్స్పీకర్లు పెట్టడాన్ని మహారాష్ట్ర నవనిర్మాణసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఉద్యమం చేస్తోంది. అయితే తాము చేపట్టిన ఉద్యమంపై మహారాష్ట్ర నవనిర్మాణసేన అధినేత రాజ్థాకరే స్పష్టత ఇచ్చారు. తాము ముస్లింలు నిర్వహించుకునే ప్రార్థనలకు వ్యతిరేకం కాదన్నారు. కానీ ముస్లింలు ప్రార్థనలను లౌడ్ స్పీకర్లలో నిర్వహిస్తే అప్పుడు తాము కూడా లౌడ్ స్పీకర్లను వినియోగించాల్సి వస్తుందన్నారు. చట్టం కంటే మతం పెద్దది కాదన్న విషయాన్ని ముస్లింలు గుర్తించాలని రాజ్థాకరే హితవు పలికారు.
మసీదుల్లో లౌడ్స్పీకర్లను మే 3 నాటికి తొలగించాలని ఇప్పటికే రాజ్థాకరే అల్టీమేటం జారీ చేశారు. లేదంటే మసీదుల ముందు లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పారాయణాలను వినిపిస్తామని ఆయన హెచ్చరించారు. మే 3 తర్వాత ఏం జరుగుతుందో వేచి చూస్తున్నట్లు రాజ్థాకరే తాజాగా స్పందించారు. అయితే మసీదుల్లో లౌడ్ స్పీకర్ల విషయంలో రాజ్థాకరే వైఖరిని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వ్యతిరేకిస్తున్నారు. యూపీలో అసదుద్దీన్ చేస్తున్న పనినే మహారాష్ట్రలో రాజ్ థాకరే చేస్తున్నారంటూ విమర్శించారు. మహారాష్ట్రలో శాంతిని చెడగొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కానీ ప్రజలు, పోలీసులు శాంతియుతంగా వ్యవహరిస్తున్నారని రౌత్ పేర్కొన్నారు. రామ్, హనుమాన్ పేరుతో థాకరే మరో ఒవైసీలా వ్యవహరిస్తున్నారని.. ఆయన ఓ హిందూ ఓవైసీ అంటూ సంజయ్ రౌత్ ఆరోపించారు.
Also Read
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
Karnataka: హుబ్లీలో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్పై అల్లరి మూకల దాడి
తాజావార్తలు
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!