Raj Thackeray: ప్రతిపక్ష కూటమితో చేరిన రాజ్ ఠాక్రే..
- ప్రతిపక్ష కూటమితో చేరిన రాజ్ ఠాక్రే..
- మహారాష్ట్రలో కీలక పరిణామం..
- బీజేపీ ఓట్లను దొంగిలిస్తుందని ఆరోపణ..
Raj Thackeray: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. రాష్ట్ర ఓటర్ల జాబితాలలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ మహా వికాస్ అఘాడి (MVA), రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) నాయకులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు. ‘‘సత్యాచా మోర్చా(సత్యం కోసం మార్చ్)’’ అనే మార్చ్ నిర్వహించాయి. ప్రతిపక్ష నేతలు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు బాలాసాహెబ్ థోరట్, రాజ్ ఠాక్రేలు కలిసి ఒకే వేదికను పంచుకున్నారు.
Read Also: Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో హత్యా రాజకీయాలు.. జేడీయూ నేత అరెస్ట్..
Also Read
వీరంతా బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ఓట్లను దొంగిలించడానికి, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి క్రమబద్ధమైన ప్రయత్నం జరుగుతోందని నేతలు ఆరోపించారు. ఎంఎన్ఎస్ కాంగ్రెస్తో కలిసి వేదిక పంచుకోవడం ఇదే మొదటిసారి. మహారాష్ట్ర అంతటా ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. ‘‘వారు నా పార్టీని దొంగిలించారు. నా తండ్రిని దొంగిలించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఓట్లను దొంగిలిస్తున్నారు’’ అని ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది త్వరలోనే నిప్పురవ్వగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యల్ని బలపరుస్తూ.. ముంబై, నాసిక్, మావల్ తో సహా అనేక నియోజకవర్గాల్లో నకిలీ ఓటర్లను జోడించారని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. అధికార పార్టీ నకిలీ ఓట్లను జోడించిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సమిష్టి పోరాటం చేయాలని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ పిలునిచ్చారు.
తాజావార్తలు
-
Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి
-
Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి
-
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
-
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!