Raj Thackeray: ప్రతిపక్ష కూటమితో చేరిన రాజ్ ఠాక్రే..
- ప్రతిపక్ష కూటమితో చేరిన రాజ్ ఠాక్రే..
- మహారాష్ట్రలో కీలక పరిణామం..
- బీజేపీ ఓట్లను దొంగిలిస్తుందని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Thackeray: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. రాష్ట్ర ఓటర్ల జాబితాలలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ మహా వికాస్ అఘాడి (MVA), రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) నాయకులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు. ‘‘సత్యాచా మోర్చా(సత్యం కోసం మార్చ్)’’ అనే మార్చ్ నిర్వహించాయి. ప్రతిపక్ష నేతలు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు బాలాసాహెబ్ థోరట్, రాజ్ ఠాక్రేలు కలిసి ఒకే వేదికను పంచుకున్నారు.
Read Also: Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో హత్యా రాజకీయాలు.. జేడీయూ నేత అరెస్ట్..
Also Read
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
వీరంతా బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ఓట్లను దొంగిలించడానికి, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి క్రమబద్ధమైన ప్రయత్నం జరుగుతోందని నేతలు ఆరోపించారు. ఎంఎన్ఎస్ కాంగ్రెస్తో కలిసి వేదిక పంచుకోవడం ఇదే మొదటిసారి. మహారాష్ట్ర అంతటా ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. ‘‘వారు నా పార్టీని దొంగిలించారు. నా తండ్రిని దొంగిలించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఓట్లను దొంగిలిస్తున్నారు’’ అని ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది త్వరలోనే నిప్పురవ్వగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యల్ని బలపరుస్తూ.. ముంబై, నాసిక్, మావల్ తో సహా అనేక నియోజకవర్గాల్లో నకిలీ ఓటర్లను జోడించారని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. అధికార పార్టీ నకిలీ ఓట్లను జోడించిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సమిష్టి పోరాటం చేయాలని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ పిలునిచ్చారు.
తాజావార్తలు
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
-
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్లో ఏముంది?
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
-
Mystery Crime Thriller OTT : కంటైనర్లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!