Agnipath Scheme: అగ్నిపథ్ పై స్పందించిన కేంద్రమంత్రులు రాజ్ నాథ్, రాజ్యవర్థన్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్నిపథ్ స్కీమ్ పై ఓవైపు దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు నెలకొన్నాయి. బీహార్, మధ్యప్రదేశ్ తో పాటు హైదరాబాద్ లో నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లను తగలబెడుతున్నారు.
తాజాగా అగ్నిపథ్ స్కీమ్ పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ భారతదేశ యువత దేశ రక్షణ రంగంలో చేరి సేవలు అందించేందుకు సుమర్ణావకాశం అని .. గత రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియ లేకపోవడంతో యువత ఆర్మీలో చేరలేకపోయిందని అయన అన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ సూచనల మేరకు అగ్నివీరుల రిక్రూట్మెంట్ వయోపరిమితిని ఈసారి 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచిందని..ఈ ఒక్కసారికి సడలింపు ఉంటుందని.. అనేక మంది యువత అగ్నివీరులుగా మాడానికి అర్హులు అవుతారని వెల్లడించారు. మరి కొద్ది రోజుల్లో సైన్యంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభం కానుందని యువతకు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆర్మీ సన్నద్ధతను మొదలుపెడుతుందని ట్వీట్ లో వెల్లడించారు.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనపై కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్పందించారు. 4 ఏళ్ల తరువాత అగ్నివీర్ ఏం చేస్తాడో అంటున్న వారు జాగ్రత్తగా స్కీమ్ ను అర్థం చేసుకోవాలని అన్నారు. దయచేసి ఎవరూ మోసపోకండి, ప్రణాళిక అర్థం చేసుకోవాలని సూచించారు. ఇది యువతకు, దేశానికి ప్రయోజనం చేకూర్చే పథకం అని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ పథకం ద్వారా ఎక్కువ మంది ఆర్మీలో చేరే అవకాశం ఉందని.. ఆ తరువాత బీఎస్ఎఫ్, పోలీస్ ఇలా వేరే సేవల్లో చేరే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీంతో పాటు 23 ఏళ్లలోనే యువత రూ. 12 లక్షల వరకు సంపాదిస్తుందని వెల్లడించారు. భారతీయ ఆర్మీ, ప్రధాని మోదీపై విశ్వాసం ఉంచాలని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!