Rahul Gandhi Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో దొంగల హల్ చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెట్టించిన ఉత్సాహంతో భారత్ జోడోయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రలో ఆయనతో పాటు వేలాదిమంది పాల్గొంటున్నారు. అయితే ఆయన పాల్గొనే పాదయాత్రలో వింత సమస్య అటు కాంగ్రెస్ కార్యకర్తలను, పోలీసులను వేధిస్తోంది. అదే దొంగల బెడద… దొంగలు జనం ఎక్కువగా వున్న చోట తమ ప్రతాపం చూపిస్తారు..అక్కడ మంత్రి వున్నా.. ఆఖరికి సీఎం వున్నా అంతే. తాజాగా రాహుల్ గాంధీ పాదయాత్రలో అదే జరిగింది. కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జేబు దొంగలు రెచ్చిపోయారు.
At the end of 5 days the #BharatJodoYatra has completed exactly 100 kms. The padayatra has rattled, unnerved and disturbed the BJP, whereas the Congress party has already been refreshed 100-fold. Every step we walk renews our resolve! pic.twitter.com/eRzYBxsvoS
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 12, 2022
అగ్రనేత రాహుల్ గాంధీతో ఫొటోలు దిగేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తుండగా.. వారి జేబులను కత్తిరిస్తున్నారు దొంగలు. పాదయాత్ర కేరళలో రెండో రోజు కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు.రాహుల్ గాంధీతో ఫొటోలు దిగేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. సందట్లో సడేమియాలా జనం జేబులను కత్తిరిస్తున్నారు దొంగలు.కేరళలోని కరమన పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగతనాలు జరిగాయని తెలుస్తోంది.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలగురు దొంగలను గుర్తించారు పోలీసులు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనే ప్రాంతంలో ఇలా దొంగతనాలు జరగడం కామన్. అయితే, పాదయాత్రలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. తమ ఫోన్లు పోయాయని కొందరు నేతలు ఫిర్యాదులు చేశారు.
Read Also: Deputy CM Narayana Swamy: అది రైతుల యాత్ర కాదు.. కోటీశ్వరుల యాత్ర
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పాదయాత్రలో భాగంగా కేరళలో 19 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. రాహుల్ కేరళలో 457 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైంది. కాశ్మీర్ లో ముగుస్తుంది.150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలితల ప్రాంతాల గుండా 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. రాహుల్ యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు, నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలో మూడుచోట్ల బహిరంగసభలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ ,శంషాబాద్, జోగిపేట లలో సభలు వుంటాయి. ఎన్నికల మేనిఫెస్టో ,రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై సభలో ప్రస్తావన వుంటుందని భావిస్తున్నారు.
Read Also:God Father: ‘జై దేవ్’గా సత్యదేవ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!