Rahul Gandhi: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ మద్దతు..
- సిక్కులపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వివాదాస్పదం..
- 1984 సిక్కు మారణహోమాన్ని ఆయన మరిచారా అంటూ బీజేపీ ఫైర్..
- రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ మద్దతు..
- ఆయన వ్యాఖ్యలు ‘‘ఖలిస్తాన్’’ డిమాండ్ని సమర్థిస్తున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు ఇంటాబయట వివాదాస్పదమవుతున్నాయి. సిక్కులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. మరోవైపు రిజర్వేషన్ల రద్దు వ్యాఖ్యలు కూడా దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా అమెరికా చట్టసభ సభ్యురాలు, భారత వ్యతిరేకి, పాకిస్తాన్ మద్దతురాలిగా పేరున్న ఇల్హాన్ ఒమర్తో రాహుల్ గాంధీ భేటీ కావడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే, సిక్కుల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మద్దతు తెలిపాడు. ‘‘భారతదేశంలో సిక్కులు తలపాగా లేదా కడాను ధరించడానికి అనుమతిస్తారా, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా అనే పోరాటం జరుగుతోంది’’ అని రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో అన్నారు. రాహుల్ గాంధీవి ‘‘ధైర్యమైన మరియు మార్గదర్శక’’ వ్యాఖ్యలు, ప్రత్యేక ఖలిస్తానీ దేశ డిమాండ్ని సమర్థిస్తాయి అని పన్నూ అన్నారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: IPS Ashna Success Story: మోడల్ నుంచి ఐపీఎస్.. అందమైన పోలీస్ అధికారిణి సక్సెస్ స్టోరీ..
‘‘భారతదేశంలో సిక్కులకు అస్తిత్వ ముప్పు గురించి గాంధీ చేసిన ప్రకటన సాహసోపేతమైనది మరియు మార్గదర్శకమైనది మాత్రమే కాదు, 1947 నుండి భారతదేశంలోని వరుస పాలనలలో సిక్కులు ఎదుర్కొంటున్న వాస్తవ చరిత్రని తెలియజేస్తుంది’’ అని పన్నూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలు సిక్కుల మాతృభూమి ఖలిస్తాన్ స్థాపించడానికి పంజాబ్లో స్వాతంత్య్ర ప్రజాభిప్రాయ సేకరణ కోసం సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) వైఖరిని కూడా ధృవీకరిస్తుందని పన్నూ చెప్పాడు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి మండిపడ్డారు. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సిక్కులపై మారణకాండ జరిగిన విషయం రాహుల్ గాంధీకి గుర్తులేదా..? అని బీజేపీ ప్రశ్నించింది. ఈ 1984 అల్లర్లలో 3000 మంది మరణించారు. నా స్నేహితులు చాలా మంది తలపాగాలను తొలగించారు, దాడికి భయపడి క్లీన్ షేవ్ చేసుకున్నారని కేంద్రమంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
-
T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
-
Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!