Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala CM: కేరళ కాంగ్రెస్లో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి భారీ విజయాన్ని సాధించింది. అయినప్పటికీ, ఇప్పటికీ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై సస్పెన్స్ వీడటం లేదు. అయితే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాత్రం కేసీ వేణుగోపాల్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నట్లు ఆ పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశానికి ముందు రాహుల్ కేసీ వేణుగోపాల్తో భేటీ అయినట్లు తెలుస్తోంది.
Read Also: PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
Also Read
- India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ బోర్డర్లో ఉద్రిక్తత.. బీజీబీ ఎందుకు రెచ్చిపోతోంది?
- Twisha Sharmas: ట్విషా శర్మ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. మృతికి ముందు రూ.20 లక్షల షేర్లపై షాకింగ్ న్యూస్
- Supreme Court: వ్యభిచారం పూర్తిగా చట్టబద్ధం కాలేదు..! ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో అసలేం ఉంది?
- Madras High Court: దేవుడి ముందు అందరూ సమానమే.. VIP దర్శనాలు ఎందుకు?
ఇదే సమయంలో కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ నేత వీడీ సతీషన్ కేసీ వేణుగోపాల్ సీఎం కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమచారం. వేణుగోపాల్కు వ్యతిరేకంగా పోస్టర్లు కూడా వెలిసినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ల వెనక సతీషన్ అనుచరుల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపై రాహుల్ గాంధీ సతీషన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సతీషన్, కేసీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాహుల్ గాంధీకి స్పష్టం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్యేలపై ప్రభావం చూపుతూ, వర్గపోరును సృష్టించారని సతీషన్ ఆరోపించారు.
ఇదే కాకుండా కేరళ సీఎం రేసులో వీరిద్దరే కాకుండా రమేష్ చెన్నితాల పేరు కూడా వినిపిస్తోంది. కేసీ వేణుగోపాల్కు ఢిల్లీ నుంచి అధిష్టానం మద్దతు లభిస్తుంటే, సతీషన్కు స్థానికంగా ఉండే కేరళలో మద్దతు ఉంది. ముఖ్యంగా మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) సతీషన్కు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 63 స్థానాలు గెలుచుకోగా, ఐయూఎంఎల్ 22 సీట్లు, కేరళ కాంగ్రెస్ 8 సీట్లు, ఆర్ఎస్పీ 3 స్థానాలు గెలిచాయి. మొత్తం యూడీఎఫ్ కూటమి 102 స్థానాలతో భారీ మెజారిటీ సాధించింది.
తాజావార్తలు
-
India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ బోర్డర్లో ఉద్రిక్తత.. బీజీబీ ఎందుకు రెచ్చిపోతోంది?
-
Twisha Sharmas: ట్విషా శర్మ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. మృతికి ముందు రూ.20 లక్షల షేర్లపై షాకింగ్ న్యూస్
-
BVS Ravi: బాలయ్య ‘అన్స్టాపబుల్’ సీక్రెట్ బయటపెట్టిన బి.వి.ఎస్. రవి! అసలు విషయం ఇదే..
-
RR Vs GT Qualifier 2: టాస్ గెలవొద్దని కోరుకుంటున్న ఆర్ఆర్(RR), జీటీ(GT) టీమ్స్.. కారణం ఏంటో తెలుసా..?
-
Supreme Court: వ్యభిచారం పూర్తిగా చట్టబద్ధం కాలేదు..! ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో అసలేం ఉంది?
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!