Rahul Gandhi: దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో యాత్రకు స్పందన.. హిందీ బెల్ట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi says Congress will form govt in Hindi belt: దక్షిణాదిలో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ‘భారత్ జోడో యాత్ర’కు మంచి స్పందన వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. హర్యానా కురుక్షేత్రలో ఆయన మీడియాతో ఆదివారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర భయం, ద్వేషం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటికి వ్యతిరేకమని ఆయన అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు, హిందీ బెల్టులో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. కొంతమంది యాత్రకు ముందు బీజేపీ రాష్ట్రాల్లో ప్రజల నుంచి రెస్పాన్స్ రాదని కొంతమంది చెప్పారని, అయితే అందుకు విరుద్ధంగా ప్రజామద్దతు లభిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Joshimath Sinking: కుంగిపోతున్న జోషిమఠ్ పట్టణం.. పీఎంఓ అత్యవసర సమావేశం
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
కేరళలో యాత్ర జరుగుతున్న సమయంలో కొంతమంది బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో ప్రజా మద్దతు లభించదని అన్నారు.. కానీ ప్రజలు జోడోయాత్రలో భాగమయ్యారని అన్నారు. యాత్ర మహారాష్ట్రకు చేరుకున్నప్పుడు దక్షిణాదితో పోలిస్తే మెరగైన స్పందన వచ్చిందన్నారు. మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉందని అక్కడ కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. రైతులు, పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వాలు ఈ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాహుల్ గాంధీ బీజేపీ మనస్సులో ఉందని.. రాహుల్ గాంధీ మనసులో బీజేపీ లేదని, నా ఇమేజ్ గురించి నేను పట్టించుకోనని అన్నారు. భగవద్గీతను గుర్తు చేస్తూ.. మీ పని చేయడం ఫలితం గురించి ఆలోచించకండి అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
దేశంలో ప్రజలను మతం ప్రాతిపదికన విభజించి విద్వేషాలను రెచ్చగొడుతున్నారని బీజేపీని విమర్శించారు. కాంగ్రెస్ గతంలో ఇలా ఎప్పుడైనా చేసిందా..? అని ప్రశ్నించారు. ఇంధన ధరలు, ఎగుమతి విధానం, బీమా ధరలు, ఎరువుల ధరలతో దేశంలో అన్ని వైపుల నుంచి రైతులపై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ దేశాన్ని ప్రేమిస్తుందని.. మేము మా ప్రజలకు, రైతులకు, పేదలకు ప్రేమ పంచుతామని.. వారితో కలిసి నడవాలని అనుకుంటున్నామని అన్నారు. దేశంలో కొంతమంది మాత్రమే సంపద, మీడియా ఇతర సంస్థలను నియంత్రిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!