Rahul Gandhi: కేంద్ర బడ్జెట్పై రాహుల్ సెటైర్లు.. అమృత్ కాల్ కాదు, మిత్ర్ కాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Satires On Union Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. నిర్మలమ్మ, ప్రధాని మోడీ చెప్తున్నట్లు.. ఇది అమృత్ కాల్ బడ్జెట్ కాదని, మిత్ర్ కాల్ బడ్జెట్ అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ కేవలం సంపన్నులకు మేలు చేస్తుందే కానీ.. పేదలకు, మధ్యతరగతి వాళ్లకు ఎలాంటి మేలు చేయదని ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్లో సరికొత్త ఉద్యోగాలు సృష్టించాలన్న విజన్ గానీ, ధరల పెరుగుదలను నియంత్రించాలనే వ్యూహం గానీ, దేశంలో అసమానతలను తగ్గించాలే ఉద్దేశం గానీ లేదని రాహుల్ మండిపడ్డారు. దేశంలో ఉన్న ఒక్క శాతం సంపన్నుల చేతిలో 40 శాతం సంపద ఉందని.. కానీ 50 శాతం పేదలే 64 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారని తెలిపారు. దేశంలోని 42 శాతం మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని, అయినా మోడీ ప్రభుత్వం ఈ సమస్యల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత భవిష్యత్తును నిర్మించే రోడ్మ్యాప్ కేంద్ర ప్రభుత్వం లేదని ఈ బడ్జెట్ రుజువు చేసిందని రాహుల్ గాంధీ ట్విటర్ మాధ్యమంగా విరుచుకుపడ్డారు.
Madan Mitra: ఒకే భార్యకు ఐదుగురు.. టీఎంసీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం ఈ కేంద్ర బడ్జెట్పై నిప్పులు చెరిగారు. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టు.. ఈ బడ్జెట్ గురించి కేంద్రం లక్ష్మీ బాంబ్ తరహాలో మాటలు మాట్లాడింది కానీ, చివరికి చిన్న టపాసులా తుస్సుమందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పిండి, పప్పులు, పాలు, వంటగ్యాస్, తదితర నిత్యావసర వస్తువుల ధరలను పెంచేసి.. మోడీ ప్రభుత్వం దేశాన్ని లూటీ చేసిందనిఆరోపించారు. బీజేపీపై ప్రజలు నిరంతరం విశ్వాసం కోల్పోతున్నారనడానికి ఈ బడ్జెట్ నిదర్శనమని అన్నారు. “మొత్తంమీద మోడీ ప్రభుత్వం ప్రజల జీవనాన్ని కష్టతరం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. మోడీ ప్రభుత్వం దేశ సంపదను దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదు. ఇది ‘నామ్ బడే ఔర్ దర్శన్ ఛోటే బడ్జెట్’ బడ్జెట్ (పైన పటారం, లోన లొటారం)’’ అని కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ సమర్పించిన తర్వాత ఖర్గే స్పందించారు.
Kishan Reddy: తెలుగు రాష్ట్రాలపై వివక్ష లేదు.. తిప్పికొట్టిన కేంద్రమంత్రి
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!