Rahul Gandhi: మీసం మెలేసిన రాహుల్ గాంధీ.. ఫోటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు ఆయనకు మద్దతుగా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా ప్రముఖ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొని ఆయనతో పాటు కలిసి నడిచాడు. ఈ సందర్భంగా మీసం తిప్పాలని విజేందర్ సింగ్ కోరాడు. దీంతో అతడి వినతి మేరకు విజేందర్తో కలిసి రాహుల్ గాంధీ మీసం మెలేశారు. ఈ ఫొటోను రాహుల్ గాంధీ తన ట్విటర్లో షేర్ చేశారు. ‘మీసంపై చేయి, చేతుల్లో బలం, దృఢ సంకల్పం, ధైర్యమైన అడుగులు’ అని ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. రాహుల్ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
मूछों पर ताव, बाज़ुओं में दम,
फौलादी इरादे, जोशीले कदम! pic.twitter.com/RzRAvv0sLmAlso Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
— Rahul Gandhi (@RahulGandhi) November 25, 2022
అటు శుక్రవారం భారత్ జోడో యాత్రకు సంబంధించి బీజేపీ నేత అమిత్ మాల్వియా తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ‘రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జోడో యాత్రలో రిచా చద్దా పాల్గొంటున్నట్లు ప్రకటన వచ్చిన అనంతరం జరిగిన సంఘటన ఇది. వీడియో చివరి వరకు సరిగ్గా చూడండి. పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపిస్తాయి. ఈ వీడియోను కాంగ్రెస్ ఎంపీ పోస్ట్ చేశారు. అయితే ఇందులో పాకిస్తాన్ అనుకూల నినాదాలు ఉన్నాయని గుర్తించిన వెంటనే డిలీట్ చేసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అసలు నిజస్వరూపం’ అని ట్వీట్ చేశారు. దీంతో బీజేపీ నేత అమిత్ మాల్వియా ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ బదులిచ్చారు. పూర్తిగా చెత్తతో నిండిపోయిన బీజేపీ చెత్త డిపార్ట్మెంట్ నుంచి ఎడిటింగ్ చేసి వచ్చిన వీడియో ఇది. భారత్ జోడో యాత్ర చాలా విజయవంతంగా కొనసాగుతోంది. దాన్ని చూసి ఓర్వలేకే బీజేపీ ఇలాంటి చిల్లర పనులకు దిగుతోంది. దీనిపై మేము చట్టబద్ధ చర్యలు తీసుకుంటాం. అలాగే బీజేపీకి వార్నింగ్ ఇస్తున్నాం. మేము కూడా ఇలాంటి ట్రిక్స్కు సిద్ధమయ్యే ఉన్నాం. వాటి రుచి మీకు తొందరలోనే చూపిస్తాం’ అంటూ జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
Read Also: Manish Pandey: అప్పుడు నా కెరీర్ నాశనం చేశారు.. ఇప్పుడు శాంసన్ కెరీర్ నాశనం చేస్తున్నారు
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!