Rahul gandhi: ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి అవమానం!.. స్వతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చివరిలో సీటు
- ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి అవమానం!
- స్వతంత్ర్య వేడుకల్లో చివరిలో సీటు
- కావాలనే అవమానించారంటూ నెటిజన్లు ఆరోపణలు
- ఖండించిన కేంద్ర రక్షణ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని మోడీ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. వాస్తవానికి పదేళ్ల తర్వాత కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా దక్కింది. ఇండియా కూటమి రాహుల్ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. అధికారికంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ను ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. అంటే కేంద్ర మంత్రికి ఉండే గౌరవం రాహుల్కి దక్కుతుంది. ఇక వాజ్పేయ్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత సోనియాగాంధీకి ముందు వరుసలోనే సీటు కేటాయించారు. కానీ మోడీ 3.0 ప్రభుత్వం మాత్రం రాహుల్ను అవమానించేలా వెనుక వరుసలో సీటు కేటాయించారని.. అది కూడా ఒలింపిక్స్ క్రీడాకారుల వెనుక కూర్చోబెట్టడం ఏంటి? అని నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాహుల్ సీటు కేటాయింపుపై సర్వత్రా తీవ్ర చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: OLA: ఓలా ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్తో 579 కి.మి!
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
రాహుల్ సీటుపై తీవ్ర దుమారం చెలరేగడంతో రక్షణ శాఖ స్పందించింది. ఎర్రకోట దగ్గర రక్షణ శాఖే ఏర్పాట్లు చేస్తుంది. అయితే ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి కేంద్రమంత్రులతో సమానంగా ముందు వరుసలోనే సీటు కేటాయించామని.. అయితే తాను ఒలింపిక్స్ క్రీడాకారుల దగ్గర కూర్చుంటానని రాహుల్ చెప్పడంతోనే అలా జరిగిందని రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. ముందు వరుసలో కేంద్రమంత్రులు అమిత్ షా, జై శంకర్, నిర్మలా సీతారామన్, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, తదితరులు కూర్చున్నారు.
అయితే ఈ విషయంపై రాహుల్ స్పందించారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. నేను ఎక్కడ ఉన్నా.. మీతోనే ఉంటా. మీలాగే ఉంటా. నిరంతరం భారతీయుల గొంతుకను అవుతాను’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Himanta Biswa Sarma: తగ్గుతున్న హిందూ జనాభా.. అస్సాం భవిష్యత్తు ప్రమాదంలో ఉంది..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!