Bharat Jodo Nyay Yatra: ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర.. రోడ్డు పక్కన టీ తాగిన రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పన్నెండవ రోజు ముగింపు దశకు చేరుకుంది. ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించనుంది. అయితే, రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం అస్సాంలోని గోలక్ గంజ్ నుంచి యాత్ర ప్రారంభించి కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా ధుబ్రి జిల్లాలోని హల్కురా గ్రామంలో ఆగిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గరకు చేరుకుని టీ తాగారు.
Read Also: Panipuri: పానీపూరీ తిని ఇద్దరు చిన్నారులు మృతి!
Also Read
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
ఇక, టీ దుకాణం యజమాని ఈ మొత్తం ఘటన సంబంధించిన విషయాలను వెల్లడించారు. రాహుల్ గాంధీ రాకను చూసి షాక్ అయ్యాను అని టీ స్టాల్ యాజమాని తెలిపారు. తన దుకాణంలోకి వచ్చి టీ తాగి, స్నాక్స్ తిని, ఇక్కడ ప్రసిద్ధి చెందిన పెరుగును రాహుల్ గాంధీ రుచి చూశారని దుకాణదారుడు చెప్పాడు. ఇక, ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించనుంది. కూచ్ బెహార్ నుంచి యాత్ర పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. ఈరోజు రాహుల్ గాంధీ కూచ్ బెహార్లోనే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభలో రాహుల్ గాంధీ తన పశ్చిమ బెంగాల్ పర్యటన వ్యూహం ఏమిటి, ఈ సందర్భంగా ఎలాంటి అంశాలను లేవనెత్తారు అనే విషయాలు ఇప్పటి వరకు వెల్లడించలేదు.
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!