Rahul Gandhi: రాహుల్ గాంధీ అధ్యక్షుడు కావాలి.. తీర్మానాలు చేస్తున్న రాష్ట్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
states Passes Resolution Backing Rahul Gandhi As Congress Chief: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే చేపట్టాలనే పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు దగ్గపడుతున్నా కొద్ది మళ్లీ రాహుల్ గాంధీనే మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీనే మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తీర్మానం చేశారు. తాజాగా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ కమిటీ కూడా రాహుల్ గాంధీనే అధ్యక్ష పదవిని చేపట్టాలని తీర్మానం చేసింది. రాహుల్ గాంధీ మరోసారి తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ఆదివారం అన్నారు.
ఇప్పటికే రెండు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు రాహుల్ గాంధీనే అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని తీర్మానాలు చేశాయని.. మరిన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇదే విధంగా నిర్ణయాలు వస్తే రాహుల్ గాంధీ తప్పకుండా తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కమిటీలు కూడా ఏకగ్రీవంగా రాహుల్ గాంధే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావాలని తీర్మానాలు చేశాయి. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబం నుంచే అధ్యక్షుడు వస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారు. ఐదు నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరగనుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా సాగి కాశ్మీర్ లో ముగుస్తుంది.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
Read Also: Perni Nani: చిరంజీవి నిఖార్సైన నాయకుడు.. పవన్ వీకెండ్ నాయకుడు
ఇదిలా ఉంటే అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 22న ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు తేదీలను ఖరారు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8 అని.. అక్టోబర్ 17న ఎన్నిక, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. అంతకు ముందు 2017లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ.. 2019 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగారు. 2019లో మరోసారి కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
తాజావార్తలు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?