Rahul Gandhi: ప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారు..? హిండెన్బర్గ్ రిపోర్ట్పై రాహుల్ గాంధీ…
- ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ఫైర్..
- హిండెన్బర్గ్ నివేదికపై ఎందుకు భయపడుతున్నారు..? ఇందులో కాంగ్రెస్ కుట్ర ఉందన్న బీజేపీ..
- నివేదికను కొట్టిపారేస్తున్న పరిశ్రమ వర్గాలు..
Rahul Gandhi: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ మరోసారి తన నివేదికతో భారత్లో రాజకీయ దుమారానికి కారణమవుతోంది. సెబీ చైర్పర్సర్ మధాబీ పూరి భుచ్పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే, దీనిపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్గా విమర్శలు ఎక్కుపెట్టారు. సెబీ యొక్క సమగ్రత ‘‘తీవ్రంగా రాజీ పడింది’’ అని అన్నారు. ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు భయపడుతున్నారనే దాన్ని హిండెన్బర్గ్ నివేదిక స్పష్టంగా తెలియజేస్తోందని ఆయన అన్నారు.
అదానీ గ్రూపుకు వ్యతిరేకం చర్యలు తీసుకోవడానికి సెబీ ఇష్టపడకపోవడానికి దాని అధినేత మధాబీ బుచ్కి అదానీ గ్రూపులో వాటాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తూ హిండెన్బర్గ్ ఒక రిపోర్టును శనివారం రాత్రి విడుదల చేసింది. “చిన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కాపాడే బాధ్యతను అప్పగించిన సెక్యూరిటీస్ రెగ్యులేటర్ సెబీ యొక్క సమగ్రత, దాని చైర్పర్సన్పై వచ్చిన ఆరోపణలతో తీవ్రంగా రాజీ పడింది” అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా వీడియోని విడుదల చేశారు. సెబీ చైర్పర్సన్ ఎందుకు రాజీనామా చేయలేదో దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు తెలుసుకోవాలనుకుంటున్నారని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
Read Also: Kolkata doctor case: వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు ముందు మద్యం.. విపరీతంగా పోర్న్ వీడియోలు..
దేశవ్యాప్తంగా నిజాయితీగల పెట్టుబడిదారులు ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తున్నారని, సెబీ చైర్పర్సన్ ఎందుకు మధాబీపూరి బుచ్ ఎందుకు రాజీనామా చేయాలేని అడుగుతున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పెట్టుబడిదారులు కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటే ప్రధాని మోడీ, సెబీ చైర్పర్సన్, గౌతమ్ అదానీ జవాబుదారీగా ఉంటారా..? అని అడిగారు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా పరిశీలిస్తుందా..? అని వీడియోలో ప్రశ్నించారు. మధాబి పూరి బుక్ మారిషస్లోని ఆఫ్షోర్ ఫండ్స్లో రహస్యంగా పెట్టుబడి పెట్టారని హిండెన్ బర్గ్ ఆరోపించింది.
ఇదిలా ఉంటే హిండెన్బర్గ్ నివేదికను బీజేపీతో పాటు పరిశ్రమ వర్గాలు తప్పుపట్టాయి. ఈ నివేదికపై పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు విమర్శలు గుప్పించారు. మరోవైపు తమకు మధాబి పూరి బుచ్తో ఎలాంటి సంబంధాలు లేవని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. హిండెన్ బర్గ్ ఎత్తుగడ వెనక కాంగ్రెస్ హస్తం ఉందని ఒక రాజకీయ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. హిండెన్బర్గ్ ఎల్లో జర్నలిజంలో మునిగిపోయిందని పలువురు మార్కెట్ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!