PM Modi: ‘‘రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ ఐసీయూలో ఉంది’’.. పాక్ పరిస్థితిపై మోడీ విమర్శలు..
- పాక్ రహీం యార్ ఖాన్ ఎయిర్బేస్ ఐసీయూలో ఉంది..
- భారత వైమానిక దాడిపై ప్రధాని మోడీ..
- ఆపరేషన్ సిందూర్లో 11 పాక్ వైమానిక స్థావరాలపై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పాకిస్తాన్పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ గురువారం రాజస్థాన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. బికనీర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాకిస్తా్న్పై మోడీ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై జరిపిన దాడుల్ని మోడీ హైలెట్ చేశారు. పాకిస్తాన్లోని రహీం యార్ ఖాన్ ఎయిర్బేస్కు జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుతూ.. ఆ ఎయిర్బేస్ ‘‘ఐసీయూ’’లో ఉందని అన్నారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ..‘‘ నేను ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు, బికనీర్లోని నల్ విమానాశ్రయంలో దిగాను. పాకిస్తాన్ కూడా దీనిని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ వారు ఈ వైమానిక స్థావరాన్ని దెబ్బతీయడంలో విఫలమయ్యారు. సరిహద్దుకు అవతలి వైపున రహీం యార్ ఖాన్ వైమానిక స్థావరం ఉంది. ఇది ఐసియులో ఉంది. ఇది ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు? భారత దళాలు ఈ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశాయి.’’ అని అన్నారు.
Also Read
Read Also: Himanta Biswa Sarma: మీకు రెండు ‘‘చికెన్ నెక్’’లు ఉన్నాయి.. బంగ్లాదేశ్కి హెచ్చరిక..
‘‘ ఈ నేలపై ప్రమాణం చేస్తున్నా, భారతదేశాన్ని ఎవరి ముందు పడనివ్వను’’ అని అన్నారు. పవిత్ర సిందూరాన్ని తుడిచిపెట్టిన వారి అంతు చూశాము, భారతదేశ రక్తాన్ని చిందించిన వారు ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నారని, భారత్ మౌనంగా ఉంటుందని భావించిన వారు ఇప్పుడు దాక్కున్నారని, తమ ఆయుధాల గురించి గొప్పలు చెప్పుకున్న వారు ఇప్పుడు శిథిలాల కింద ఖననం చేయబడ్డారని ప్రధాని మోడీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ ప్రతీకార చర్య కాదని, న్యాయం యొక్క కొత్త రూపం అని నొక్కి చెబుతూ, ఇది కేవలం ఆగ్రహాన్ని వ్యక్తపరచడమే కాకుండా భారతదేశం యొక్క అచంచలమైన బలం మరియు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ వైమానిక దళం పాకిస్తాన్లోని 11 ఎయిర్బేస్ను ధ్వంసం చేసింది. ముఖ్యంగా రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్తో సహా రఫికీ, సర్గోదా, జకోబాబాద్, కరాచీ, స్కర్దు, రహీం యార్ ఖాన్ ఇలా పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడి తర్వాతే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!