PM Modi: ‘‘రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ ఐసీయూలో ఉంది’’.. పాక్ పరిస్థితిపై మోడీ విమర్శలు..
- పాక్ రహీం యార్ ఖాన్ ఎయిర్బేస్ ఐసీయూలో ఉంది..
- భారత వైమానిక దాడిపై ప్రధాని మోడీ..
- ఆపరేషన్ సిందూర్లో 11 పాక్ వైమానిక స్థావరాలపై దాడి..
PM Modi: పాకిస్తాన్పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ గురువారం రాజస్థాన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. బికనీర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాకిస్తా్న్పై మోడీ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై జరిపిన దాడుల్ని మోడీ హైలెట్ చేశారు. పాకిస్తాన్లోని రహీం యార్ ఖాన్ ఎయిర్బేస్కు జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుతూ.. ఆ ఎయిర్బేస్ ‘‘ఐసీయూ’’లో ఉందని అన్నారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ..‘‘ నేను ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు, బికనీర్లోని నల్ విమానాశ్రయంలో దిగాను. పాకిస్తాన్ కూడా దీనిని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ వారు ఈ వైమానిక స్థావరాన్ని దెబ్బతీయడంలో విఫలమయ్యారు. సరిహద్దుకు అవతలి వైపున రహీం యార్ ఖాన్ వైమానిక స్థావరం ఉంది. ఇది ఐసియులో ఉంది. ఇది ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు? భారత దళాలు ఈ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశాయి.’’ అని అన్నారు.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
Read Also: Himanta Biswa Sarma: మీకు రెండు ‘‘చికెన్ నెక్’’లు ఉన్నాయి.. బంగ్లాదేశ్కి హెచ్చరిక..
‘‘ ఈ నేలపై ప్రమాణం చేస్తున్నా, భారతదేశాన్ని ఎవరి ముందు పడనివ్వను’’ అని అన్నారు. పవిత్ర సిందూరాన్ని తుడిచిపెట్టిన వారి అంతు చూశాము, భారతదేశ రక్తాన్ని చిందించిన వారు ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నారని, భారత్ మౌనంగా ఉంటుందని భావించిన వారు ఇప్పుడు దాక్కున్నారని, తమ ఆయుధాల గురించి గొప్పలు చెప్పుకున్న వారు ఇప్పుడు శిథిలాల కింద ఖననం చేయబడ్డారని ప్రధాని మోడీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ ప్రతీకార చర్య కాదని, న్యాయం యొక్క కొత్త రూపం అని నొక్కి చెబుతూ, ఇది కేవలం ఆగ్రహాన్ని వ్యక్తపరచడమే కాకుండా భారతదేశం యొక్క అచంచలమైన బలం మరియు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ వైమానిక దళం పాకిస్తాన్లోని 11 ఎయిర్బేస్ను ధ్వంసం చేసింది. ముఖ్యంగా రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్తో సహా రఫికీ, సర్గోదా, జకోబాబాద్, కరాచీ, స్కర్దు, రహీం యార్ ఖాన్ ఇలా పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడి తర్వాతే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?