JDU: రబ్రీదేవికి సంతకం పెట్టడం రాదు, ఆమె కూడా బడ్జెట్పై మాట్లాడుతోంది..
- కేంద్ర బడ్జెట్లో బీహార్కి ఏమీ ఇవ్వలేదన్న రబ్రీదేవి..
- ఆమెకు సంతకం కూడా పెట్టరాదు.. బడ్జెట్పై మాట్లాడుతోంది..
- జేడీయూ ఎదురుదాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JDU: ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆర్జేడీడీ నేత, లాలూ ప్రసాద్ భార్య రబ్రీ దేవి విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై జేడీయూ ఎంపీ లల్లన్ సింగ్ ఫైరయ్యారు. బడ్జెట్లో సామాన్యులకు ఏమీ లేదని, కేంద్రం బీహార్కి బొమ్మ(జుంఝానా) మాత్రమే ఇచ్చిందని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ బీజేపీ మిత్రపక్షం జేడీయూ విమర్శలు గుప్పిస్తోంది.
ఆమె వ్యాఖ్యలపై జేడీయూ ఎంపీ లల్లన్ సింగ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి(రబ్రీ దేవీ)కి సంతకం ఎలా చేయాలో కూడా తెలియదని, ఆమె బడ్జెట్పై ఎలా మాట్లాడుతుంది..? అని ఎద్దేవా చేశారు. బీహార్కు రూ.26,000 కోట్లు కేటాయించడం సాధారణ ప్రజల కోసం కాదని, కార్పొరేట్ రంగానికి ఉద్దేశించిన బడ్జెట్పై కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్జేడీ విమర్శించింది. ఈ బడ్జెట్ కార్పొరేట్ రంగానికి మాత్రమే అని విమర్శించింది.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: Ratan Tata: ఒక్క ప్రకటనతో రూ.19 వేల కోట్లు రాబట్టిన రతన్ టాటా..ఆ ప్రకటన ఇదే…
‘‘ ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ రంగానికి మాత్రమే. కేంద్రం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎలా కల్పించాలో కేంద్ర ఆర్థిక మంత్రికి ఎలాంటి ఆలోచన లేదు. ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో యువత, రైతులు, మహిళలు, కార్మికుల సమస్యలను ప్రస్తావించలేదు’’ అని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర అన్నారు. బీహార్కి ప్రత్యేక హోదా అవసరమని, కేంద్రం దాన్ని తిరస్కరించిందని చెప్పారు.
ఇదిలా ఉంటే ఈ బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి పెద్దపీట వేశారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం రూ.26,000 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా బీహార్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీహార్కి మూడు ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులను కేటాయించింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!