Putin: రష్యాతో సంబంధాలను తగ్గించుకోవాలని భారత్పై అమెరికా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల మధ్య, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి వచ్చే ఏ ఆదేశాలను కూడా భారత్ పాటించలేదని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక (SPIEF)లో ఆయన మాట్లాడుతూ.. భారత్ సార్వభౌమాధికారాన్ని, సార్వభౌమ నిర్ణయాధికారాన్ని ఎన్నడూ ప్రశ్నించలేరని అన్నారు.
“భారత్ ఎప్పుడూ విదేశాల నుంచి వచ్చే ఆదేశాలను అనుసరించలేదు. అలాగే చైనా కూడా. సార్వభౌమత్వం, స్వతంత్ర నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించలేరు” అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి సహకరించేలా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొంటుందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు భారత్కు మద్దతుగా నిలిచాయి. తన జాతీయ ప్రయోజనాల కోసం భారత్ నిర్ణయాలు తీసుకుంటుందని పుతిన్ వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.

