BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
- ఢిల్లీలో పుతిన్ అడుగుపెట్టారు
- మోడీతో కీలక చర్చలు
- బ్రిక్స్ సదస్సుపై ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vladimir Putin Arrives in Delhi for BRICS Summit 2026: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో అడుగుపెట్టారు. పాలం ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. భారత్ ఈ ఏడాది బ్రిక్స్కు అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు, ప్రభుత్వ పెద్దలు హాజరుకానున్నారు.
నేడు మోడీ-పుతిన్ కీలక భేటీ
పుతిన్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగే ద్వైపాక్షిక సమావేశం కీలకంగా మారనుంది. సెప్టెంబర్ 11న ఇరువురు నేతలు భేటీ కానున్నట్లు రష్యా, భారత వర్గాల నుంచి సమాచారం వెలువడింది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారం, ఇంధనం, రక్షణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల ఆగస్టు 31న కిర్గిజిస్థాన్లో జరిగిన ఎస్సీఓ సదస్సు సందర్భంగా మోడీ, పుతిన్ భేటీ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఢిల్లీలో ఇరువురు నేతలు సమావేశం కానుండటంతో ఈ భేటీపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
రక్షణ రంగంపై కూడా చర్చకు అవకాశం
మోడీ-పుతిన్ సమావేశంలో రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు కూడా ప్రాధాన్యత పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా S-400 వ్యవస్థలో మిగిలిన యూనిట్ డెలివరీ, తదుపరి తరం బ్రహ్మోస్ క్షిపణుల అభివృద్ధి వంటి అంశాలు చర్చకు రావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, అణు ఇంధన సహకారం, సాంకేతికత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.
పుతిన్ పర్యటనకు భారీ భద్రత
పుతిన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయన ప్రయాణించే మార్గాలతో పాటు హోటళ్లు, బ్రిక్స్ సదస్సు జరిగే భారత్ మండపం పరిసరాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. రష్యా భద్రతా బృందాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని భారత భద్రతా సంస్థలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించినట్లు సమాచారం. పుతిన్తో పాటు వచ్చే భద్రతా సిబ్బంది కూడా ఆయన పర్యటనలో ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో సుమారు 30,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు నివేదికలు వెల్లడించాయి.
సెప్టెంబర్ 12, 13న బ్రిక్స్ సదస్సు
18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తదితర దేశాల నేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఆర్థిక సహకారం, ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రత, అంతర్జాతీయ వ్యవహారాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు వంటి కీలక అంశాలపై బ్రిక్స్ దేశాల నేతలు చర్చించనున్నారు.
భారత్-రష్యా సంబంధాలకు ప్రాధాన్యం
భారత్-రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో పుతిన్ పర్యటన కీలకంగా మారనుంది. రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధనం, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాల సహకారం కొనసాగుతోంది. ఆగస్టు 31న మోదీ-పుతిన్ భేటీలోనూ ఈ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చ జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో జరగనున్న మోడీ-పుతిన్ సమావేశం ద్వారా భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యంపై మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?