Punjab: “ఉనికిలో లేని” శాఖకు 20 నెలలుగా మంత్రి.. ఆప్ సర్కార్పై బీజేపీ విమర్శలు..
- ‘‘లేని’’ శాఖకు 20 నెలలుగా మంత్రి..
- పంజాబ్లో ఆప్ సర్కార్ బాగోతం..
- భగవంత్ మాన్ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం ‘‘లేని’’ శాఖకు మంత్రిని నియమించింది. గత 20 నెలలుగా మంత్రి ఆ శాఖను నడిపాడని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పంజాబ్ మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్న కుల్దీప్ సింగ్ ధాలివాల్ రెండు విభాగాలకు మంత్రికి పనిచేస్తున్నారు. ఇందులో ఒకటి మనుగడలోనే లేదు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం దీనిని గమనించి, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన సవరణలు చేయడానికి దాదాపుగా 20 నెలలు పట్టింది. మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్కి కేటాయించిన ‘‘పరిపాలన సంస్కరణల శాఖ’’ అసలు ఉనికిలోనే లేదని పంజాబ్ ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం ధాలివాల్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను మాత్రమే కలిగి ఉన్నారు.
Read Also: Hamas: మరో ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన హమాస్
Also Read
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
ధాలివాల్కి మొదటగా వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖను కేటాయించారు. అయితే, మే 2023లో జనవరిలో జరిగిన మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో ఆ బాధ్యతల నుంచి తొలగించబడ్డారు. ఆ తర్వాత ఆయనకు పరిపాలన సంస్కరణల శాఖను కేటాయించారు. అయితే, తాజాగా పంజాబ్ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పుడు పరిపాలన సంస్కరణల శాక ఉనికిలో లేదని పేర్కొంది.
అయితే, ఈ వ్యవహారంపై బీజేపీ, ఆప్ సర్కార్ని తీవ్రంగా విమర్శించింది. దాదాపుగా రెండేళ్లుగా ఉనికిలో లేని శాఖను ఒక మంత్రి ఎలా నిర్వహించారని ప్రశ్నించింది. ఆప్ పంజాబ్ పాలనను జోక్గా మార్చిందని, ఆప్ మంత్రి 20 నెలలుగా లేని శాఖను నడిపాడని, 20 నెలలుగా ఒక సీఎం లేని ఒక శాఖను నడుపుతున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ఒక శాఖ లేదని తెలుసుకునేందుకు ఆప్ ప్రభుత్వానికి 20 నెలలు పట్టిందని దుయ్యబట్టారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక మోసగాడు, ఆయన ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు.
తాజావార్తలు
-
IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
-
Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!