Punjab: పంజాబ్లో ఆయుధ స్మగ్లింగ్ రాకెట్ను ఛేదించిన పోలీసులు..
- పంజాబ్లో ఆయుధ స్మగ్లింగ్ రాకెట్ను ఛేదించిన పోలీసులు
- లాండాకు చెందిన ఇద్దరు ఉగ్రవాద సహచరుల అరెస్టు
- వారి వద్ద నుండి 32 బోర్ పిస్టల్స్
- మ్యాగజైన్లు
- మందుగుండు సామగ్రి స్వాధీనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మార్గదర్శకాల ప్రకారం.. పంజాబ్ను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు జరుగుతున్న ప్రచారంలో స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ (SSOC) అమృత్సర్ అంతర్-రాష్ట్ర ఆయుధాల అక్రమ రవాణా మాడ్యూల్ను బహిర్గతం చేసింది. ఈ ఆపరేషన్లో విదేశీ మూలం ఉన్న ఉగ్రవాది లఖ్బీర్ అలియాస్ లాండాకు చెందిన ఇద్దరు సహచరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఆరు అధునాతన 32 బోర్ పిస్టల్స్తో పాటు మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Trump Media: హత్యాయత్నం తర్వాత 70 శాతం పెరిగిన ట్రంప్ మీడియా స్టాక్!
Also Read
- Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
- Amit Shah-Om Birla: లోక్సభ స్పీకర్కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
- NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్షీట్
- Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
అరెస్టయిన వారిని తర్న్ తరణ్లోని తథియాన్ గ్రామానికి చెందిన సుమిత్పాల్ సింగ్, తర్న్ తరన్లోని చంబా కలాన్కు చెందిన అర్పణ్దీప్ సింగ్గా గుర్తించినట్లు పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌరవ్ యాదవ్ తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ సహచరులకు మధ్యప్రదేశ్ నుంచి ఆయుధాలు లభించినట్లు సమాచారం అందడంతో ఎస్ఎస్ఓసీ అమృత్సర్కు చెందిన పోలీసు బృందాలు అమృత్సర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆపరేషన్ నిర్వహించి నిందితులిద్దరినీ అరెస్టు చేశాయని డీజీపీ తెలిపారు.
Snake Man: 172 సార్లు విషసర్పాల కాటుకు గురయ్యాడు.. అయినా వందేళ్లు బతికాడు
నిందితులు ఎంపీ కేంద్రంగా అక్రమ ఆయుధాల వ్యాపారులతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సుమారు 15 రోజుల క్రితం నిందితుడు ఆయుధాల సరుకును తీసుకోవడానికి బస్సులో మధ్యప్రదేశ్ కు వెళ్లి అక్కడి నుండి రైలులో అమృత్సర్కు తిరిగి వచ్చారని ఆయన చెప్పారు. అరెస్టయిన నిందితులు గత రెండు నెలల్లో మధ్యప్రదేశ్ కు చెందిన ఆయుధ వ్యాపారి నుంచి కొనుగోలు చేసిన రెండో సరుకు అని, పోలీసులు గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. మిగిలిన నిందితులను అరెస్టు చేయడంతోపాటు మధ్యప్రదేశ్ నుంచి జరుగుతున్న అక్రమ ఆయుధాల అక్రమ రవాణాను అరికట్టేందుకు వారికి ఉన్న లింక్లను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది. నేరస్థులకు విక్రయించేందుకే తాము ఈ ఆయుధాలను సేకరించినట్లు అరెస్టయిన నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నెల రోజుల క్రితం హరికే ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులకు రెండు పిస్టల్స్ విక్రయించినట్లు నిందితులు అంగీకరించారని డీజీపీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్ను ఎలా నడిపించారు?
-
Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
-
Explainer: ఒకే ఒక హాస్పిటల్ బిల్లు.. మొత్తం సేవింగ్స్ ఊస్ట్..!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..