Puja Khedkar: మరోసారి వార్తల్లో పూజా ఖేద్కర్.. ఈసారి దేనికోసమంటే..!
- మరోసారి వార్తల్లో పూజా ఖేద్కర్
- దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. యూపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినందుకు 2024లో ఐఏఎస్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. అనంతరం గతేడాది పూజా ఖేద్కర్ తండ్రి.. ఓ డ్రైవర్ను కిడ్నాప్ చేయడంతో మళ్లీ వార్తల్లో హల్చల్ చేశారు. తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి తమ కుటుంబ సమస్యలపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.
ఇది కూడా చదవండి: Silver Rates: వామ్మో సిల్వర్.. మళ్లీ తాండవమే! ఈరోజు ఎంత పెరిగిందంటే..!
Also Read
తమ ఇంట్లో దొంగతనం జరిగిందని శనివారం పూజా ఖేద్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేపాల్ నుంచి వచ్చిన పని మనిషి.. ఆహారం, పానీయాల్లో మత్తుమందులు కలిపి ఇవ్వడంతో తన తల్లిదండ్రులు, సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పూణెలోని బనేర్ రోడ్ నివాసంలో పూజా ఖేద్కర్ ఇంటికి వెళ్లారు. అక్కడ వాచ్మెన్ జితేంద్ర సింగ్, తల్లిదండ్రులు దిలీప్, మనోరమ మంచంపై అపస్మారక స్థితిలో కనిపించారు. ఇక గదిలో అల్మారాలు, మూడు గదులు తెరిచి ఉన్నాయని.. అంతస్తుల్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరో దూకుడు.. వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటన
పోలీసులు వెంటనే పూజా ఖేద్కర్ తల్లిదండ్రులతో పాటు వాచ్మన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ డ్రైవర్ దాదాసాహెబ్ ధకానే మరొక గదిలో ఉండగా.. వంటవాడు సుజత్ రాయ్ ఇంకొక గదిలో ఉన్నారు. వీరిని కూడా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో తాను తప్పించుకోగలిగానని.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పూజా ఖేద్కర్ తెలిపారు. ఇక ఆమె సోదరులు వినయ్, హర్షద్ బుధ్వంత్ కూడా క్షేమంగా ఉన్నారు.
ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. పూజా ఖేద్కర్ ఆదివారం నాటికి అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదని.. ఏవేవి దొంగిలించబడ్డాయో వివరాలు అందించలేదని పోలీసులు తెలిపారు.
2024లో పూణెలో ఐఏఎస్ ప్రొబెషనర్ పిరియడ్లో ఉండగా పూజా ఖేద్కర్ గొంతెమ్మ కోర్కెలు కోరింది. ట్రైనింగ్ సమయంలో ఎలాంటి సదుపాయాలు ఉండవు. కానీ అంతకు మించి కోర్కెలు కోరారు. దీంతో ఆమెపై ఫిర్యాదులు వెళ్లాయి. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఉద్యోగం పొందినట్లుగా తేలడంతో యూపీఎస్సీ వేటు వేసింది. భవిష్యత్లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా సస్పెన్షన్ చేసింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!