Puja Khedkar: హైకోర్టులో పూజా ఖేద్కర్ మరో పిటిషన్.. ఏం అభ్యర్థించిందంటే..!
- హైకోర్టులో పూజా ఖేద్కర్ మరో పిటిషన్
- కేవలం ఐదు పరీక్షలనే పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తాను 12 సార్లు సివిల్స్ పరీక్షలు రాశానని.. అయితే వాటిలో కేవలం ఐదింటిని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆమె కోరారు. ఐఏఎస్ ఉద్యోగాన్ని సంపాదించడానికి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో యూపీఎస్సీ ఆమెపై చర్యలు తీసుకుంది. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. దీంతో ఆమె ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అనర్హత వేటుపై ఆమె కోర్టులో వాదనలు వినిపించింది. ఏసీఎల్ గాయం కారణంగా ఎడమ మోకాలు అస్థిరంగా ఉన్నట్లు మహారాష్ట్ర హాస్పటల్ ఇచ్చిన ధృవీకరణ ఉందని ఆమె కోర్టుకు వెల్లడించింది. తాను దివ్యాంగురాలి కేటగిరిలో రాసిన పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు. తనకు 47శాతం వైకల్యం ఉందని.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 శాతం దాటితే దివ్యాంగులుగా గుర్తిస్తారని ఆమె వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Plot to kill Wife: సవతి కుమార్తెతో లైంగిక సంబంధం.. కొకా-కోలాలో డ్రగ్స్ కలిపి భార్య మర్డర్కి ప్లాన్..
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
జనరల్ కేటగిరి అభ్యర్థినిగా రాసిన ఏడు పరీక్షలను పరిగణనలోకి తీసుకోకూడదని తాజాగా న్యాయస్థానంలో దాఖలు చేసిన ప్రమాణపత్రంలో ఆమె పేర్కొన్నారు. ఒకవేళ న్యాయస్థానం దీనిని అంగీకరిస్తే ఆమె.. కేవలం ఐదుసార్లు మాత్రమే పరీక్షలకు హాజరైనట్లు అవుతుంది. ఫోర్జరీ, చీటింగ్ కేసుల్లో తనను అరెస్టు చేయకుండా పూజా ఖేద్కర్ కొన్నాళ్ల క్రితం ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పోలీసులు ఈ అంశంపై స్పందన తెలియజేయాలని.. అప్పటివరకు ఆమెను అరెస్టు చేయవద్దని న్యాయస్థానం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Nimmala Rama Naidu: మంత్రి నిమ్మల, ఎమ్మెల్యేలకు తృటిలో తప్పిన ప్రమాదం
ఇక పేరులో మార్పులు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 12 సార్లు సివిల్స్ పరీక్షలకు హాజరైనట్లు వచ్చిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. పేరు మధ్యలో మాత్రమే చిన్న మార్పు చేశానని.. మొత్తం మార్చలేదని ఆమె వాదిస్తున్నారు. యూపీఎస్సీ బయోమెట్రిక్ వ్యవస్థ డేటా కూడా తన గుర్తింపును పరీక్షించిందని పేర్కొంది.
తాజావార్తలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్పై మరో బిగ్ క్లాష్!
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!