Kolkata Doctor Case: కోల్కతా ఆస్పత్రి విధ్వంసం గురించి పోలీసులకు తెలియదా..? ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్..
- సంచలనంగా కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసు..
- ఆస్పత్రి విధ్వంసాన్ని విచారించిన హైకోర్టు..
- పోలీసులు.. బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: కోల్కతా వైద్యురాలి అత్యాచార, హత్య ఘటన పశ్చిమ బెంగాల్తో పాటు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఘటన జరిగిన ఆర్జీ కర్ ఆస్పత్రి యాజమాన్యం, పోలీసుల తీరుపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. కోల్కతా పోలీసుల వైఫల్యంతో ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించింది హైకోర్టు. ప్రభుత్వ యాజమాన్యంలో మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఆగస్టు 9న లేడీ డాక్టర్ దారుణంగా హత్యకు గురైంది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమెపై అత్యాచారం చేసి, చంపేశారు. శుక్రవారం తెల్లవారుజామున కాలేజీ సెమినార్ హాలులో ఆమె మృతదేహం నగ్నంగా కనిపించింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో ఆమె శరీరంలో 150 మిల్లిగ్రాముల వీర్యం దొరకడంతో ఇది సామూహిక అత్యాచారంగా బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టుకి తెలిపారు.
ఇదిలా ఉంటే, గురువరాం ‘‘రిక్లెయిమ్ ది నైట్’’ పేరుతో బాధితురాలికి న్యాయం జరగాలని వైద్యులు, మహిళలు పెద్ద ఎత్తున ఆస్పత్రి ముందు నిరసన తెలిపిన సమయంలో, ఓ గుంపు ఆస్పత్రికలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడింది. సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంలో ఇలా వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నారు.
Also Read
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
తాజాగా ఈ విధ్వంసంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. “ప్రభుత్వ యంత్రాంగం యొక్క సంపూర్ణ వైఫల్యం” విధ్వంసానికి దారితీసిందని చెప్పింది. రాష్ట్ర పోలీసుల వైద్య సదుపాయాలను, అక్కడ పనిచేస్తున్న వైద్యుల్ని రక్షించలేకపోతే దానిని మూసేయాలంటూ బెంగాల్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ముందస్తు ప్రణాళికతో జరిగిన విధ్వంసంపై మధ్యంతర నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
విధ్వంసం గురించి రాష్ట్రం తరుపున కోర్టుకు విన్నవిస్తూ.. సుమారు 7000 మంది గుంపు వచ్చిందని, ఆ సంఖ్య అకాస్మత్తుగా పెరిగిందని, తమ దగ్గర వీడియోలు ఉన్నాయని, వారు బారికేడ్లు బద్దలు కొట్టారని, టియర్ గ్యాస్ ప్రయోగించామని, 15 మంది పోలీసులకు గాయాలయ్యాయని చెప్పింది. అయితే, వారి వాదనల్ని విన్న కోర్టు.. పోలీసులకు తెలియకుండా ఈ ఘటన జరిగిందని నమ్మడం చాలా కష్టమని వ్యాఖ్యానించింది. ఇంత అస్థిరమైన అంశంపై ప్రజా నిరసనలకు ఎందుకు అనుమతి ఇచ్చారో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం డిమాండ్ చేసింది.”సాధారణంగా పోలీసులకు ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది… హనుమాన్ జయంతి రోజున ఇలాంటివి జరిగాయి. 7,000 మంది గుమిగూడితే, పోలీసులకు తెలియదని నమ్మడం కష్టం.” అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వాదనల్ని కోర్టు తీవ్రంగా ఖండించింది.
మీరు చర్యలు తీసుకుంటున్నారా..? నివారణ చర్యలు ఏమిటి..? అని కోర్టు ప్రశ్నించింది. బాధితురాలి తరుపున వాదించిన సీనియర్ న్యాయవాది బికాష్ రంజన్ భట్టాచార్య, పోలీసులు నిరసనకారుల వెనక దాక్కున్నారు అని వాదించారు. విధ్వంసం నుంచి క్రైమ్ సీన్ని కాపాడలేకపోయారని పోలీసులపై ఆరోపించారు. విధ్వంసానికి పాల్పడిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటనలకు సంబంధించి అన్ని విషయాలను సీబీఐకి ఇవ్వాలని కోల్కతా పోలీసులను కోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!