CAA Protests: ఈశాన్య రాష్ట్రాల్లో “సీఏఏ”పై నిరసనలు.. రెండేళ్ల తరువాత ఇప్పుడే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Protests Against CAA: దాదాపుగా సుదీర్ఘ విరామం తరువాత వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం( సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఏఏఎస్యూ) సీఏఏకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఎన్ఈఎస్ఓ) ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపింది. దాదాపు రెండేళ్ల క్రితం సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఆ తరువాతి కాలంలో కరోనా మహమ్మారి రావడంతో పెద్దగా అల్లర్లు జరగలేదు. తాజాగా మళ్లీ ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు పెంచేలా కొన్ని శక్తులు కావాలనే సీఏఏ ఉద్యమాన్ని తీసుకువస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
Read Also: Aa Ammayi Gurinchi Meeku Cheppali: నా ఫైరింగ్ వలనే ఇండస్ట్రీ చల్లగా ఉంది అంటున్న మహేష్ బావ
Also Read
- NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో సీఏఏకు వ్యతిరేకంగా 2019లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ తరువాత ఇప్పుడే మళ్లీ సీఏఏ నిరసనలు ప్రారంభం అయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశం దృష్టిని ఆకర్షించేందుకు ఈ నిరసనలు చేపడుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. అక్రమ వలసదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు, అస్సాం ఒప్పందాన్ని అమలు చేయడం, ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం( ఏఎఫ్ఎస్పీఏ) ఉపసంహరించుకోవాలని.. మొదలైన సమస్యలపై ఈశాన్య భారతంలో నిరసనలు జరగుతున్నాయి.
డిసెంబర్ 11, 2019న పార్లమెంట్ సీఏఏ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ 31 కన్నా ముందుగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు.. 1955 పౌరసత్వ చట్టాన్ని సవరించింది. అయితే ఈ చట్టంలో ముస్లింల ప్రస్తావన లేదని.. ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్డీయే ప్రభుత్వం మతపరమైన వివక్ష చూపిస్తోందని ఆందోళనలు చేశాయి. అయితే కేంద్రం మాత్రం సరిహద్దు దేశాల్లో మైనారిటీలుగా ఉండీ.. నిత్యం హింసకు గురువుతున్న వారికి ఆశ్రయం కల్పించి, పౌరసత్వం ఇవ్వాలని ఈ బిల్లును తీసుకువచ్చింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!