CAA Protests: ఈశాన్య రాష్ట్రాల్లో “సీఏఏ”పై నిరసనలు.. రెండేళ్ల తరువాత ఇప్పుడే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Protests Against CAA: దాదాపుగా సుదీర్ఘ విరామం తరువాత వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం( సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఏఏఎస్యూ) సీఏఏకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఎన్ఈఎస్ఓ) ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపింది. దాదాపు రెండేళ్ల క్రితం సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఆ తరువాతి కాలంలో కరోనా మహమ్మారి రావడంతో పెద్దగా అల్లర్లు జరగలేదు. తాజాగా మళ్లీ ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు పెంచేలా కొన్ని శక్తులు కావాలనే సీఏఏ ఉద్యమాన్ని తీసుకువస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
Read Also: Aa Ammayi Gurinchi Meeku Cheppali: నా ఫైరింగ్ వలనే ఇండస్ట్రీ చల్లగా ఉంది అంటున్న మహేష్ బావ
Also Read
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
- Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో సీఏఏకు వ్యతిరేకంగా 2019లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ తరువాత ఇప్పుడే మళ్లీ సీఏఏ నిరసనలు ప్రారంభం అయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశం దృష్టిని ఆకర్షించేందుకు ఈ నిరసనలు చేపడుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. అక్రమ వలసదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు, అస్సాం ఒప్పందాన్ని అమలు చేయడం, ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం( ఏఎఫ్ఎస్పీఏ) ఉపసంహరించుకోవాలని.. మొదలైన సమస్యలపై ఈశాన్య భారతంలో నిరసనలు జరగుతున్నాయి.
డిసెంబర్ 11, 2019న పార్లమెంట్ సీఏఏ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ 31 కన్నా ముందుగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు.. 1955 పౌరసత్వ చట్టాన్ని సవరించింది. అయితే ఈ చట్టంలో ముస్లింల ప్రస్తావన లేదని.. ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్డీయే ప్రభుత్వం మతపరమైన వివక్ష చూపిస్తోందని ఆందోళనలు చేశాయి. అయితే కేంద్రం మాత్రం సరిహద్దు దేశాల్లో మైనారిటీలుగా ఉండీ.. నిత్యం హింసకు గురువుతున్న వారికి ఆశ్రయం కల్పించి, పౌరసత్వం ఇవ్వాలని ఈ బిల్లును తీసుకువచ్చింది.
తాజావార్తలు
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
-
Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
-
Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!