Uttar Pradesh: యూపీ అల్లర్లలో 337 మందిని అరెస్ట్ చేసిన యోగీ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్ అల్లర్లలో యోగీ సర్కార్ పట్టుబిగిస్తోంది. అల్లర్లకు కారణం అయిన వారిని వరసగా అరెస్ట్ చేస్తోంది. ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలను చేశారు. అయితే చాలా వరకు శాంతియుతంగానే నిరసనలు తెలిపినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా యూపీలోని కాన్పూర్, ప్రయాగ్ రాజ్, సహరాన్ పూర్, హత్రాస్ ఇలా కొన్ని ప్రాంతాల్లో అల్లరి మూకలు విధ్వంసానికి తెరతీశాయి. రాళ్లలో దాడుల చేశారు. దీంతో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ఈ అల్లర్లపై తీవ్రంగా రియాక్ట్ అయింది. అల్లర్లకు కారణం అయిన వారిని అరెస్ట్ చేస్తూ యోగీ మార్క్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
ఇప్పటి వరకు అల్లర్లకు కారణమైన 337 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిది జిల్లాల్లో దాదాపుగా 13 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. ఫిరోజా బాద్ లో 18, అంబేద్కర్ నగర్ లో 41, మురాదాబాద్ లో 40, సహరాన్ పూర్ లో 83, ప్రయాగ్ రాజ్ లో 92, హత్రాస్ లో 52, అలీఘడ్ లో 6, జలౌన్ లో 5 మందిని అరెస్ట్ చేశారు. కాన్పూర్ అల్లర్లలో మాస్టర్ మైండ్ అయిన జాఫర్ హయత్ హష్మీని పోలీసులు విచారిస్తున్నారు. అల్లర్లకు ప్రధాన సూత్రధారులుగా ఉన్న సైఫుల్లా, మహ్మద్ నసీమ్, మహ్మద్ ఉమర్ లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అల్లర్ల వెనక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
అయితే పోలీస్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. కాన్పూర్లో జరిగిన హింసాకాండలో ప్రధాన నిందితుడు జాఫర్ హయత్ హష్మీ తన సంస్థకు బిల్డర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల నుండి నిధులు సమకూర్చినట్లు వెల్లడించాడు. మరోవైపు పీఎఫ్ఐ నిధుల వ్యవహారంలో నిందితుల విచారణ కొరకు ఈడీ కాన్పూర్ పోలీసులు సంప్రదించింది. ఇదిలా ఉంటే నిందితుల అక్రమ నిర్మాణాలను యోగీ సర్కార్ బుల్డోజర్లతో కూల్చేస్తోంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!