Uttar Pradesh: యూపీ అల్లర్లలో 337 మందిని అరెస్ట్ చేసిన యోగీ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్ అల్లర్లలో యోగీ సర్కార్ పట్టుబిగిస్తోంది. అల్లర్లకు కారణం అయిన వారిని వరసగా అరెస్ట్ చేస్తోంది. ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలను చేశారు. అయితే చాలా వరకు శాంతియుతంగానే నిరసనలు తెలిపినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా యూపీలోని కాన్పూర్, ప్రయాగ్ రాజ్, సహరాన్ పూర్, హత్రాస్ ఇలా కొన్ని ప్రాంతాల్లో అల్లరి మూకలు విధ్వంసానికి తెరతీశాయి. రాళ్లలో దాడుల చేశారు. దీంతో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ఈ అల్లర్లపై తీవ్రంగా రియాక్ట్ అయింది. అల్లర్లకు కారణం అయిన వారిని అరెస్ట్ చేస్తూ యోగీ మార్క్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
ఇప్పటి వరకు అల్లర్లకు కారణమైన 337 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిది జిల్లాల్లో దాదాపుగా 13 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. ఫిరోజా బాద్ లో 18, అంబేద్కర్ నగర్ లో 41, మురాదాబాద్ లో 40, సహరాన్ పూర్ లో 83, ప్రయాగ్ రాజ్ లో 92, హత్రాస్ లో 52, అలీఘడ్ లో 6, జలౌన్ లో 5 మందిని అరెస్ట్ చేశారు. కాన్పూర్ అల్లర్లలో మాస్టర్ మైండ్ అయిన జాఫర్ హయత్ హష్మీని పోలీసులు విచారిస్తున్నారు. అల్లర్లకు ప్రధాన సూత్రధారులుగా ఉన్న సైఫుల్లా, మహ్మద్ నసీమ్, మహ్మద్ ఉమర్ లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అల్లర్ల వెనక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Also Read
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Rahul Gandhi on NEET Paper Leak: "యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే".. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
అయితే పోలీస్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. కాన్పూర్లో జరిగిన హింసాకాండలో ప్రధాన నిందితుడు జాఫర్ హయత్ హష్మీ తన సంస్థకు బిల్డర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల నుండి నిధులు సమకూర్చినట్లు వెల్లడించాడు. మరోవైపు పీఎఫ్ఐ నిధుల వ్యవహారంలో నిందితుల విచారణ కొరకు ఈడీ కాన్పూర్ పోలీసులు సంప్రదించింది. ఇదిలా ఉంటే నిందితుల అక్రమ నిర్మాణాలను యోగీ సర్కార్ బుల్డోజర్లతో కూల్చేస్తోంది.
తాజావార్తలు
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!