One Nation One Election: జేపీసీ కమిటీలో ప్రియాంకాగాంధీకి చోటు!
- జేపీసీకి వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు
- జేపీసీ కమిటీలో ప్రియాంకాగాంధీకి చోటు!
- నాలుగు పేర్లు ప్రతిపాదించిన కాంగ్రెస్
- తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదన తిరస్కరణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ రాజకీయ చరిత్రలో మంగళవారం చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 90 నిమిషాల చర్చ తర్వాత బిల్లుకు అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. అయితే కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. జాయింట్ పార్లమెంట్ కమిటీకి బిల్లు పంపాలని డిమాండ్ చేశాయి. దీంతో బిల్లును జేపీసీ కమిటీకి పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అయితే ఒకే దేశం-ఒకే ఎన్నికపై నియమించిన జాయింట్ పార్లమెంట్ కమిటీలో కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీకి చోటు దక్కినట్లు తెలుస్తోంది. ప్యానెల్లో ప్రియాంకను భాగం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రియాంకతో పాటు మనీష్ తివారీకి చోటు లభించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జమిలిపై రాజ్యాంగ సవరణ బిల్లును ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
Also Read
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
పార్లమెంట్లో ప్రస్తుతం బీజేపీ తర్వాత కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అయితే జమిలి ఎన్నికల బిల్లు పరిశీలనకు కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ, మనీష్ తివారీ, రణదీప్ సుర్జేవాలా, సుఖ్దేయో భగత్ సింగ్ పేర్లను కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఇండియా కూటమిలో మిత్రపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ కూడా పలు పేర్లు ప్రతిపాదించింది. టీఎంసీ నుంచి సాకేత్ గోఖలే, కల్యాణ్ బెనర్జీ పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. ఫైనల్గా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!