Raghav Chadha: ఆప్ ఎంపీకి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghav Chadha: ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధాకు పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. రాజ్యసభ ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎంపీకి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని రాజ్యసభలో నలుగురు ఎంపీలు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ప్రివిలేజ్ కమిటీ ఎంపీకి నోటీసులు ఇచ్చింది. నలుగురు ఎంపీలు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
Read also: Poultry Farm: కోళ్ల ఫారం పెట్టాలనుకుంటున్నారా?.. ఇది మీ కోసమే..
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
నిబంధనలను ఉల్లంఘించి తమ అనుమతి లేకుండా హౌస్ ప్యానెల్కు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తమ పేర్లను ప్రతిపాదించారని ఆరోపించిన నలుగురు ఎంపీల ఫిర్యాదులను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ బుధవారం పరిశీలించి.. దర్యాప్తు చేసేందుకు ప్రివిలేజెస్ కమిటీకి సూచించారు. తమ అనుమతి లేకుండా తమ పేర్లతో సహా ఇతర వ్యక్తుల ప్రత్యేక హక్కులను చద్దా ఉల్లంఘించారని ఎంపీలు సస్మిత్ పాత్ర, ఎస్ ఫాంగ్నాన్ కొన్యాక్, ఎం తంబిదురై మరియు నరహరి అమీన్ల నుండి చైర్మన్కు ఫిర్యాదులు అందాయని రాజ్యసభ బులెటిన్లో పేర్కొంది. ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023’ను పరిగణనలోకి తీసుకునేందుకు సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని చద్దా ప్రతిపాదించారు. అందులో నలుగురు ఎంపీల పేర్లను చేర్చారు.
రాజ్యసభ ఛైర్మన్, రాజ్యసభ, రాష్ట్రాల కౌన్సిల్ (రాజ్యసభ)లో విధివిధానాలు మరియు పార్లమెంట్ బిజినెస్ రూల్ 203 కింద ఈ విషయాన్ని పరిశీలించి, దర్యాప్తు చేసి నివేదిక కోసం ప్రివిలేజెస్ కమిటీకి పంపారని రాజ్యసభ బులెటిన్ పేర్కొంది. సెలెక్ట్ కమిటీకి పంపాలని సంతకాలు ఉన్న నలుగురు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఆ సంతకాలు చేయలేదని.. తమ సంతకాలను చద్దా ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఈ అంశంపై విచారణకు ఛైర్మన్ ఆదేశించారు. ఎంపీల ఫిర్యాదు అంశంపై చర్చించేందుకు బుధవారం ప్రివిలేజ్ కమిటీ సమావేశం అయింది. సమావేశంలో ఎంపీ రాఘవ్ చద్ధాకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించడంతో .. సమావేశం అనంతరం ప్రివిలేజ్ కమిటీ రాఘవ్ చద్దాకు నోటీసులను జారీ చేసింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!