Raghav Chadha: ఆప్ ఎంపీకి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghav Chadha: ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధాకు పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. రాజ్యసభ ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎంపీకి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని రాజ్యసభలో నలుగురు ఎంపీలు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ప్రివిలేజ్ కమిటీ ఎంపీకి నోటీసులు ఇచ్చింది. నలుగురు ఎంపీలు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
Read also: Poultry Farm: కోళ్ల ఫారం పెట్టాలనుకుంటున్నారా?.. ఇది మీ కోసమే..
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
నిబంధనలను ఉల్లంఘించి తమ అనుమతి లేకుండా హౌస్ ప్యానెల్కు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తమ పేర్లను ప్రతిపాదించారని ఆరోపించిన నలుగురు ఎంపీల ఫిర్యాదులను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ బుధవారం పరిశీలించి.. దర్యాప్తు చేసేందుకు ప్రివిలేజెస్ కమిటీకి సూచించారు. తమ అనుమతి లేకుండా తమ పేర్లతో సహా ఇతర వ్యక్తుల ప్రత్యేక హక్కులను చద్దా ఉల్లంఘించారని ఎంపీలు సస్మిత్ పాత్ర, ఎస్ ఫాంగ్నాన్ కొన్యాక్, ఎం తంబిదురై మరియు నరహరి అమీన్ల నుండి చైర్మన్కు ఫిర్యాదులు అందాయని రాజ్యసభ బులెటిన్లో పేర్కొంది. ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023’ను పరిగణనలోకి తీసుకునేందుకు సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని చద్దా ప్రతిపాదించారు. అందులో నలుగురు ఎంపీల పేర్లను చేర్చారు.
రాజ్యసభ ఛైర్మన్, రాజ్యసభ, రాష్ట్రాల కౌన్సిల్ (రాజ్యసభ)లో విధివిధానాలు మరియు పార్లమెంట్ బిజినెస్ రూల్ 203 కింద ఈ విషయాన్ని పరిశీలించి, దర్యాప్తు చేసి నివేదిక కోసం ప్రివిలేజెస్ కమిటీకి పంపారని రాజ్యసభ బులెటిన్ పేర్కొంది. సెలెక్ట్ కమిటీకి పంపాలని సంతకాలు ఉన్న నలుగురు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఆ సంతకాలు చేయలేదని.. తమ సంతకాలను చద్దా ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఈ అంశంపై విచారణకు ఛైర్మన్ ఆదేశించారు. ఎంపీల ఫిర్యాదు అంశంపై చర్చించేందుకు బుధవారం ప్రివిలేజ్ కమిటీ సమావేశం అయింది. సమావేశంలో ఎంపీ రాఘవ్ చద్ధాకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించడంతో .. సమావేశం అనంతరం ప్రివిలేజ్ కమిటీ రాఘవ్ చద్దాకు నోటీసులను జారీ చేసింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..