Tax Refund: ఏపీ, తెలంగాణ నుంచి అత్యధిక ట్యాక్స్ రిఫండ్.. పట్టుబడితే కఠిన చర్యలు తప్పవంటున్న ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tax Refund: పన్ను మినహాయింపులు కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అత్యధిక రిటర్న్ లు దాఖలయ్యాయని.. అవన్నీ తప్పుల తడకలని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత తెలిపారు. గడిచిన మూడేళ్లుగా తెలంగాణ, ఏపీలో తప్పుడు క్లెయిమ్లతో ఉద్యోగులు అత్యధిక రిటర్న్ లు దాఖలు చేసి.. రిఫండ్ పొందినట్టు తమ విచారణలో తేలిందన్నారు. వీరిలో ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్యూ)ల్లో పనిచేసే వారు, ప్రతిష్టాత్మక ఐటీ సంస్థల్లో పనిచేసే వారే ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. హైదరాబాద్లోని ఐటీ టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిథాలి మాట్లాడారు. 2021-212 ఆర్థిక సంవత్సరంలో 37 శాతం ఉన్న రిఫండ్ మొత్తం 2022-23లో ఒక్కసారిగా 84 శాతానికి పెరిగిందని చెప్పారు. కొంత మంది అర్హత లేని ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ ఉద్యో్గులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్ని సంప్రదించి అత్యధిక రిఫండ్ ఇప్పిస్తామని ఆశ చూపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తప్పుడు రిటర్న్ లతో ఎక్కువగా రిఫండ్ ఇప్పించి అందులో కమిషన్ తీసుకుంటున్నట్టు తెలిసిందని వివరించారు. ఈ విషయమై తెలంగాణ, ఏపీలో నిర్వహించిన దాడుల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె చెప్పారు. ఇలా తప్పుడు రిటర్న్లతో ఎక్కువగా రిఫండ్ పొందిన ఉద్యోగులు పనిచేసే సంస్థలు ఇతర రాష్ట్రాల్లో ఉండగా.. వారి పాన్ మాత్రం ఏపీ, తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు.
Read also: IND vs WI: భారత్తో టెస్ట్ సిరీస్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. బాహుబలి రీఎంట్రీ!
Also Read
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
గత మూడేళ్లలో తప్పుడు సమాచారంతో రిఫండ్ తీసుకున్న ఉద్యోగులు సవరించిన రిటర్న్లు దాఖలు చేసేందుకు ఒక అవకాశం ఇస్తున్నామని, సరైన రిటర్న్లు దాఖలు చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోని వారు తమ తదుపరి పరిశీలనలో పట్టుబడితే మాత్రం చట్టప్రకారం కఠినచర్యలు తప్పవని మిథాలి హెచ్చరించారు. ఐటీ అధికారుల పరిశీలనలో చాలా మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తప్పుడు విధానాల్లో రిటర్న్లు ఫైల్ చేసినట్లు తేలిందని చెప్పారు. కొందరైతే 75 నుంచి 90 శాతం రిఫండ్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఇది అత్యధికంగా ఉందని తెలిపారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, హైదరాబాద్ల్లో చేపట్టిన తనిఖీల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని మిథాలి వివరించారు. అవకతవకలకు పాల్పడిన వారు రిఫండ్ సొమ్ముపై 12 శాతం వడ్డీతో పాటు 200 శాతం జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. తప్పుడు క్లైయిమ్స్తో రిఫండ్ పొందిన వారు ఐటీ చట్టంలోని సెక్షన్ 139(8ఏ) ప్రకారం 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సరైన రిటర్న్లు దాఖలు చేయాలని సూచించారు. సెక్షన్ 140బీ ప్రకారం పన్ను తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రిటర్న్లు సమర్పించిన వారు 139(5) సెక్షన్ ప్రకారం సవరించిన రిటర్న్లు దాఖలు చేయాలని సూచించారు.
తాజావార్తలు
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
-
Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
-
UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!