Tax Refund: ఏపీ, తెలంగాణ నుంచి అత్యధిక ట్యాక్స్ రిఫండ్.. పట్టుబడితే కఠిన చర్యలు తప్పవంటున్న ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tax Refund: పన్ను మినహాయింపులు కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అత్యధిక రిటర్న్ లు దాఖలయ్యాయని.. అవన్నీ తప్పుల తడకలని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత తెలిపారు. గడిచిన మూడేళ్లుగా తెలంగాణ, ఏపీలో తప్పుడు క్లెయిమ్లతో ఉద్యోగులు అత్యధిక రిటర్న్ లు దాఖలు చేసి.. రిఫండ్ పొందినట్టు తమ విచారణలో తేలిందన్నారు. వీరిలో ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్యూ)ల్లో పనిచేసే వారు, ప్రతిష్టాత్మక ఐటీ సంస్థల్లో పనిచేసే వారే ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. హైదరాబాద్లోని ఐటీ టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిథాలి మాట్లాడారు. 2021-212 ఆర్థిక సంవత్సరంలో 37 శాతం ఉన్న రిఫండ్ మొత్తం 2022-23లో ఒక్కసారిగా 84 శాతానికి పెరిగిందని చెప్పారు. కొంత మంది అర్హత లేని ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ ఉద్యో్గులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్ని సంప్రదించి అత్యధిక రిఫండ్ ఇప్పిస్తామని ఆశ చూపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తప్పుడు రిటర్న్ లతో ఎక్కువగా రిఫండ్ ఇప్పించి అందులో కమిషన్ తీసుకుంటున్నట్టు తెలిసిందని వివరించారు. ఈ విషయమై తెలంగాణ, ఏపీలో నిర్వహించిన దాడుల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె చెప్పారు. ఇలా తప్పుడు రిటర్న్లతో ఎక్కువగా రిఫండ్ పొందిన ఉద్యోగులు పనిచేసే సంస్థలు ఇతర రాష్ట్రాల్లో ఉండగా.. వారి పాన్ మాత్రం ఏపీ, తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు.
Read also: IND vs WI: భారత్తో టెస్ట్ సిరీస్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. బాహుబలి రీఎంట్రీ!
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
గత మూడేళ్లలో తప్పుడు సమాచారంతో రిఫండ్ తీసుకున్న ఉద్యోగులు సవరించిన రిటర్న్లు దాఖలు చేసేందుకు ఒక అవకాశం ఇస్తున్నామని, సరైన రిటర్న్లు దాఖలు చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోని వారు తమ తదుపరి పరిశీలనలో పట్టుబడితే మాత్రం చట్టప్రకారం కఠినచర్యలు తప్పవని మిథాలి హెచ్చరించారు. ఐటీ అధికారుల పరిశీలనలో చాలా మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తప్పుడు విధానాల్లో రిటర్న్లు ఫైల్ చేసినట్లు తేలిందని చెప్పారు. కొందరైతే 75 నుంచి 90 శాతం రిఫండ్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఇది అత్యధికంగా ఉందని తెలిపారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, హైదరాబాద్ల్లో చేపట్టిన తనిఖీల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని మిథాలి వివరించారు. అవకతవకలకు పాల్పడిన వారు రిఫండ్ సొమ్ముపై 12 శాతం వడ్డీతో పాటు 200 శాతం జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. తప్పుడు క్లైయిమ్స్తో రిఫండ్ పొందిన వారు ఐటీ చట్టంలోని సెక్షన్ 139(8ఏ) ప్రకారం 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సరైన రిటర్న్లు దాఖలు చేయాలని సూచించారు. సెక్షన్ 140బీ ప్రకారం పన్ను తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రిటర్న్లు సమర్పించిన వారు 139(5) సెక్షన్ ప్రకారం సవరించిన రిటర్న్లు దాఖలు చేయాలని సూచించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!