PM Narendra Modi: హవాయ్ చెప్పులేసుకునే వాళ్లు విమానం ఎక్కాలి.. ఖర్గే పేరుకే కాంగ్రెస్ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: దేశంలో వేగంగా విమానయాన రంగం విస్తరిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు మోదీ. మరోసారి కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటోంది బీజేపీ. దీంతో భాగంగానే కొద్ది రోజుల వ్యవధిలో రెండుసార్లు కర్ణాటకలో పర్యటించారు ప్రధాని. ఇదిలా ఉంటే సోమవారం శివమొగ్గలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. హవాయ్ చెప్పులేసుకునే వారు కూడా విమానం ఎక్కాలన్న తమ సంకల్పం ఇప్పుడు నెరవేరుతోందని అన్నారు.
Read Also: Chhattisgarh: తాను చనిపోయి కూతురును కాపాడిన తల్లి.. 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాటం
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
దేశంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, రాబోయే కాలంలో దేశానికి వేలాది విమానాలు అవసరం ఉంటాయని అన్నారు. మేడ్ ఇన్ ఇండియా విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే రోజూ ఎంతో దూరంలో లేదని మోదీ అన్నారు. దేశమంతా విమాన మార్గాలను విస్తరించాలనే ఆలోచనలో శివమొగ్గ విమానాశ్రయాన్ని రూ.400 కోట్లతో నిర్మించామని, ప్రతీ గంటలకు 300 మంది ప్రయాణికులు వెళ్లేలా టెర్మినల్ నిర్మించినట్లు చెప్పారు. మల్నాడు ప్రాంతం ప్రజలు ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లేందుకు ఈ ఎయిర్ పోర్టు ఉపయోగపడుతుందని అన్నారు. మాజీముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కలల ప్రాజెక్టు అని, ఆయన 80 జన్మదినం రోజే దీన్ని ప్రారంభించడం విశేషం అని కొనియాడారు.
ప్రధాని పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ చీఫ్ మల్లికార్జన ఖర్గేని ఉద్దేశించి మాట్లాడారు. ఖర్గే పేరుకు మాత్రమే అధ్యక్షుడని రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో ప్రపంచానికి అంతా తెలుసని పరోక్షంగా గాంధీ కుటుంబాన్ని విమర్శించారు. ఖర్గే సాధ్యమైనంత రీతిలో ప్రజలకు సేవలు అందించారని.. అయితే ఇటీవల ఆ పార్టీ ప్లీనరీలో ఆయనను అవమానించడం చూసి నిరాశ చెందానని అన్నారు.
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!