PM Narendra Modi: హవాయ్ చెప్పులేసుకునే వాళ్లు విమానం ఎక్కాలి.. ఖర్గే పేరుకే కాంగ్రెస్ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: దేశంలో వేగంగా విమానయాన రంగం విస్తరిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు మోదీ. మరోసారి కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటోంది బీజేపీ. దీంతో భాగంగానే కొద్ది రోజుల వ్యవధిలో రెండుసార్లు కర్ణాటకలో పర్యటించారు ప్రధాని. ఇదిలా ఉంటే సోమవారం శివమొగ్గలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. హవాయ్ చెప్పులేసుకునే వారు కూడా విమానం ఎక్కాలన్న తమ సంకల్పం ఇప్పుడు నెరవేరుతోందని అన్నారు.
Read Also: Chhattisgarh: తాను చనిపోయి కూతురును కాపాడిన తల్లి.. 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాటం
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
దేశంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, రాబోయే కాలంలో దేశానికి వేలాది విమానాలు అవసరం ఉంటాయని అన్నారు. మేడ్ ఇన్ ఇండియా విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే రోజూ ఎంతో దూరంలో లేదని మోదీ అన్నారు. దేశమంతా విమాన మార్గాలను విస్తరించాలనే ఆలోచనలో శివమొగ్గ విమానాశ్రయాన్ని రూ.400 కోట్లతో నిర్మించామని, ప్రతీ గంటలకు 300 మంది ప్రయాణికులు వెళ్లేలా టెర్మినల్ నిర్మించినట్లు చెప్పారు. మల్నాడు ప్రాంతం ప్రజలు ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లేందుకు ఈ ఎయిర్ పోర్టు ఉపయోగపడుతుందని అన్నారు. మాజీముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కలల ప్రాజెక్టు అని, ఆయన 80 జన్మదినం రోజే దీన్ని ప్రారంభించడం విశేషం అని కొనియాడారు.
ప్రధాని పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ చీఫ్ మల్లికార్జన ఖర్గేని ఉద్దేశించి మాట్లాడారు. ఖర్గే పేరుకు మాత్రమే అధ్యక్షుడని రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో ప్రపంచానికి అంతా తెలుసని పరోక్షంగా గాంధీ కుటుంబాన్ని విమర్శించారు. ఖర్గే సాధ్యమైనంత రీతిలో ప్రజలకు సేవలు అందించారని.. అయితే ఇటీవల ఆ పార్టీ ప్లీనరీలో ఆయనను అవమానించడం చూసి నిరాశ చెందానని అన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!