PM Narendra Modi: హవాయ్ చెప్పులేసుకునే వాళ్లు విమానం ఎక్కాలి.. ఖర్గే పేరుకే కాంగ్రెస్ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: దేశంలో వేగంగా విమానయాన రంగం విస్తరిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు మోదీ. మరోసారి కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటోంది బీజేపీ. దీంతో భాగంగానే కొద్ది రోజుల వ్యవధిలో రెండుసార్లు కర్ణాటకలో పర్యటించారు ప్రధాని. ఇదిలా ఉంటే సోమవారం శివమొగ్గలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. హవాయ్ చెప్పులేసుకునే వారు కూడా విమానం ఎక్కాలన్న తమ సంకల్పం ఇప్పుడు నెరవేరుతోందని అన్నారు.
Read Also: Chhattisgarh: తాను చనిపోయి కూతురును కాపాడిన తల్లి.. 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాటం
Also Read
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
దేశంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, రాబోయే కాలంలో దేశానికి వేలాది విమానాలు అవసరం ఉంటాయని అన్నారు. మేడ్ ఇన్ ఇండియా విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే రోజూ ఎంతో దూరంలో లేదని మోదీ అన్నారు. దేశమంతా విమాన మార్గాలను విస్తరించాలనే ఆలోచనలో శివమొగ్గ విమానాశ్రయాన్ని రూ.400 కోట్లతో నిర్మించామని, ప్రతీ గంటలకు 300 మంది ప్రయాణికులు వెళ్లేలా టెర్మినల్ నిర్మించినట్లు చెప్పారు. మల్నాడు ప్రాంతం ప్రజలు ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లేందుకు ఈ ఎయిర్ పోర్టు ఉపయోగపడుతుందని అన్నారు. మాజీముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కలల ప్రాజెక్టు అని, ఆయన 80 జన్మదినం రోజే దీన్ని ప్రారంభించడం విశేషం అని కొనియాడారు.
ప్రధాని పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ చీఫ్ మల్లికార్జన ఖర్గేని ఉద్దేశించి మాట్లాడారు. ఖర్గే పేరుకు మాత్రమే అధ్యక్షుడని రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో ప్రపంచానికి అంతా తెలుసని పరోక్షంగా గాంధీ కుటుంబాన్ని విమర్శించారు. ఖర్గే సాధ్యమైనంత రీతిలో ప్రజలకు సేవలు అందించారని.. అయితే ఇటీవల ఆ పార్టీ ప్లీనరీలో ఆయనను అవమానించడం చూసి నిరాశ చెందానని అన్నారు.
తాజావార్తలు
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!