Chhattisgarh: తాను చనిపోయి కూతురును కాపాడిన తల్లి.. 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Fights Wild boar: ఎంతటి కష్టం వచ్చినా కూడా తన బిడ్డలను కాపాడుకుంటుంది అమ్మ. తన పిల్లలకు కష్టం వస్తుందంటే ఎందాకైనా పోరాడుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే చత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది. తన కూతురును రక్షించుకోవడానికి 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాడింది. చివరకు తాను ప్రాణాలు కోల్పోయి, కూతురును రక్షించుకుంది. ఈ విషాదకర సంఘటన చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో జరిగింది. తల్లి ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది ఈ ఘటన.
Read Also: Pawan Kalyan: చరణ్- ఎన్టీఆర్ ఫ్యాన్ వార్.. మధ్యలో ఇరుక్కుపోయిన పవన్
Also Read
వివరాల్లోకి వెళితే చత్తీస్ గఢ్ కోర్బా జిల్లా పసన్ అటవీ ప్రాంతంలో తేలియామర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దువ్సియా బాయి(45) తన కూతురు 11 ఏళ్ల రింకీతో కలిసి పొలానికి వెళ్లింది. ఆ సమయంలో అడవి పందీ రింకీపై దాడి చేసింది. ఇది గమనించిన దువ్సియా బాయి కూతురుని రక్షించేందుకు అడవి పందితో వీరోచితంగా పోరాడింది. తన ప్రాణాలను పణంగా పెట్టి కూతురును దాడి నుంచి కాపాడింది. దాదాపు 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాడింది.
ఈ పోరాటంతో దువ్సియా బాయి, అడవి పందిని హతమార్చి తను కూడా ప్రాణాలను కోల్పోయింది. గాయాలపాలైన రింకీ గ్రామం వైపు పరుగులు తీసుకుంటూ వెళ్లి విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది. గ్రామస్తులు అందించిన సమాచారంతో అటవీ, పోలీస్ శాఖలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే దువ్సియా బాయి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయింది. రింకీని చికిత్స నిమిత్తం పసన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
-
Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..