Chhattisgarh: తాను చనిపోయి కూతురును కాపాడిన తల్లి.. 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Fights Wild boar: ఎంతటి కష్టం వచ్చినా కూడా తన బిడ్డలను కాపాడుకుంటుంది అమ్మ. తన పిల్లలకు కష్టం వస్తుందంటే ఎందాకైనా పోరాడుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే చత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది. తన కూతురును రక్షించుకోవడానికి 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాడింది. చివరకు తాను ప్రాణాలు కోల్పోయి, కూతురును రక్షించుకుంది. ఈ విషాదకర సంఘటన చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో జరిగింది. తల్లి ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది ఈ ఘటన.
Read Also: Pawan Kalyan: చరణ్- ఎన్టీఆర్ ఫ్యాన్ వార్.. మధ్యలో ఇరుక్కుపోయిన పవన్
Also Read
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
- Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
వివరాల్లోకి వెళితే చత్తీస్ గఢ్ కోర్బా జిల్లా పసన్ అటవీ ప్రాంతంలో తేలియామర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దువ్సియా బాయి(45) తన కూతురు 11 ఏళ్ల రింకీతో కలిసి పొలానికి వెళ్లింది. ఆ సమయంలో అడవి పందీ రింకీపై దాడి చేసింది. ఇది గమనించిన దువ్సియా బాయి కూతురుని రక్షించేందుకు అడవి పందితో వీరోచితంగా పోరాడింది. తన ప్రాణాలను పణంగా పెట్టి కూతురును దాడి నుంచి కాపాడింది. దాదాపు 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాడింది.
ఈ పోరాటంతో దువ్సియా బాయి, అడవి పందిని హతమార్చి తను కూడా ప్రాణాలను కోల్పోయింది. గాయాలపాలైన రింకీ గ్రామం వైపు పరుగులు తీసుకుంటూ వెళ్లి విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది. గ్రామస్తులు అందించిన సమాచారంతో అటవీ, పోలీస్ శాఖలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే దువ్సియా బాయి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయింది. రింకీని చికిత్స నిమిత్తం పసన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!