PM Modi: సునీతా విలియమ్స్కి ప్రధాని మోడీ లేఖ.. ఏమన్నారంటే..
- సునీతా విలియమ్స్కి ప్రధాని మోడీ లేఖ..
- భారతీయులంతా మద్దతు మీకు ఉంటుందన్న ప్రధాని..
- భారత్ రావాలని ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. సునీతాతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గతేడాది ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)’’లో కొన్ని నెలలుగా చిక్కుబడిపోయారు. వీరిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్ ‘‘స్టార్ లైనర్’’లో సాంకేతిక సమస్యలు ఏర్పడం, హీలియం లీకేజీ, థ్రస్టర్ల వైఫల్యం వంటి సమస్యలను ఎదుర్కోవడంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
తాజాగా, వీరిద్దరు నాసా-స్పేస్ ఎక్స్ క్రూ-10 ద్వారా ఐఎస్ఎస్ నుంచి భూమి మీకు వచ్చేందుకు 17 గంటల ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ మేరకు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్కి ప్రధాని నరేంద్రమోడీ లేఖ రాశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ప్రధాని లేఖను పంచుకున్నారు. ఈ లేఖని మార్చి 1న ప్రధాని మోడీ రాశారు. ఇటీవల అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అంతకుముందు ప్రెసిడెంట్ జో బైడెన్ని కలిసినప్పుడు సునీతా విలియమ్స్ శ్రేయస్సు గురించి విచారించినట్లు ప్రధాని చెప్పారు. ఈ నెలలో ఢిల్లీలో నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో జరిగిన మీటింగ్లో కూడా ప్రస్తావన వచ్చినట్లు లేఖలో మోడీ గుర్తు చేసుకున్నారు.
Also Read
Read Also: Nagpur Violence: నాగ్పూర్ హింస ఒక “కుట్ర”.. “ఛావా”పై షిండే కామెంట్స్..
‘‘మీ పట్ల, మీ పని పట్ల మేము ఎంతో గర్వపడుతున్నామో చర్చించుకున్నాము. ఈ సంభాషన తర్వాత నేను మీకు లేఖ రాయకుండా ఉండలేకపోయాను’’ అని ప్రధాని అన్నారు. ‘‘1.4 బిలియన్ల భారతీయులు మీ విజయానికి ఎల్లప్పుడూ గొప్పగా గర్విస్తుంటారు. ఇటీవల పరిణామాలు మీ స్ఫూర్తిదాయకమైన ధైర్యం, పట్టుదలని మరోసారి ప్రదర్శించాయి’’ అని లేఖలో పేర్కొన్నారు. సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావాలని ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి ప్రపంచం ఎదురుచూస్తోందని, మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ మా హృదయాలు మీకు దగ్గరగా ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు.
‘‘దివంగత దీపక్భాయ్ ఆశీస్సులు కూడ మీకు ఉంటాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ అని ప్రధాని అన్నారు. సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ భాయ్ మోడీ సొంత రాష్ట్రం గుజరాత్కి చెందిన వారు. ఆయన 2020లో మరణించారు. 2016లో అమెరికా పర్యటన సందర్భంగా సునీతా విలియమ్స్, ఆమె తండ్రిని కలిసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. సునీతా విలియమ్స్ తిరిగి వచ్చిన తర్వాత, భారత్ రావాలని ఆయన కోరుకున్నారు.
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్వర్క్.. కేన్స్లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!