గత వారం నుంచి దేశ వ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసిందే. తాజాగా ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోడీ స్పందించారు. డీజీసీఏ నిబంధనలు వ్యవస్థను మెరుగుపరచడానికే గానీ.. ప్రజలను వేధించడానికి కాదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Vijay: పుదుచ్చేరి విజయ్ సభలో గన్ కలకలం.. ఒకరు అరెస్ట్
మంగళవారం ఉదయం ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండిగో సంక్షోభంపై స్పందించారు. నియమాలు, నిబంధనలు వ్యవస్థను మెరుగుపరిచేలా చూసుకోవాలని.. అంతేకాని భారతీయ పౌరులను ఇబ్బందులకు గురి చేయడానికి కాదన్నారు. వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని ప్రధాని మోడీ చెప్పినట్లుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు వెల్లడించారు. ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోడీ ఇండిగో సంక్షోభం కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Himachal Pradesh: అరుదైన సంఘటన.. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు ప్రత్యక్షం
గత వారం నుంచి దేశంలో ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో నరకయాతన పడుతున్నారు. వందలాది విమానాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఆయా ఎయిర్పోర్టుల్లో ఇరుక్కుని తిండి తిప్పలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Trump: భారత్కు ట్రంప్ మరో వాణిజ్య హెచ్చరిక.. ఈసారి దేనిపైనంటే..!