Presidential Election Result: ముగిసిన ఎంపీ ఓట్ల లెక్కింపు.. ద్రౌపది ముర్ముకు 540 ఎంపీల ఓట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Presidential Election Result: రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే అని తెలుస్తున్నా.. ఎంత మెజారిటీతో గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. గురువారం ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం ఎంపీల ఓట్ల లెక్కింపుతో తొలి రౌండ్ ముగిసింది. ఎంపీల ఓట్ల లెక్కింపులో ద్రౌపది ముర్ము భారీగా ఓట్లను సాధించారు. ద్రౌపది ముర్ము 540 మంది ఎంపీల మద్దతులో 3,78,000 విలువను సాధించారు. ఇదే సమయంలో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 మంది ఎంపీలు మద్దతు పలికారు. 1,45,600 ఓట్ల విలువను సాధించారు. మొత్తం 740 మంది ఓట్లేయాగా.. ద్రౌపది ముర్ముకు 540 మంది ఎంపీలు ఓటు వేయగా.. యశ్వంత్ సిన్హాకు 208 మంది ఎంపీలు ఓటేయగా..15 ఓట్లు చెల్లలేదు.
Read Also: Nupur Sharma: నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకు యువకుడిపై దాడి.. 8 మంది నిందితుల అరెస్ట్
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
గత ఎన్నికల్లో ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ కు 7 లక్షల 2 వేల ఓట్ల విలువ రాగా.. ప్రత్యర్థిగా ఉన్న మీరా కుమార్ కు 3 లక్షల 67 వేలు. ప్రస్తుతం ట్రెండ్స్ , బీజేపీ వర్గాల అంచానాల ప్రకారం గతంలో కన్నా ఈ సారి ఎక్కువ ఓట్లు వస్తాయని భావిస్తోంది. ప్రస్తుతం ఇద్దరి మధ్య భారీగా తేడా ఉంది. ప్రస్తుతం ఎంపీల ఓట్లలో ద్రౌపది ముర్ము 72.19 శాతం ఓట్లను సాధించారు.కాసేపట్లో ఎమ్మెల్యే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ఫలితాలు అధికారికంగా వచ్చే అవకాశం ఉంది. ద్రౌపతి ముర్ముకు 62 శాతం ఓట్లు రావచ్చని అంచానా వేస్తున్నారు. ఫలితాలు వెలువడగానే.. బీజేపీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. ఎన్నికల ఫలితాల తరువాత స్వయంగా ప్రధాని మోదీ, ద్రౌపది ముర్ము నివాసానికి వెళ్లి అభినందించనున్నట్లు తెలుస్తోంది. ఇక ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రం ఒడిశాలో రైరంగ్పూర్ గ్రామంలో సంబరాలు ప్రారంభం అయ్యాయి.
#WATCH | Celebrations begin at Odisha's Rairangpur village, the native place of NDA's presidential candidate Droupadi Murmu.
The counting of votes for the Presidential election is underway. pic.twitter.com/7AmzaSepHr
— ANI (@ANI) July 21, 2022
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!