Nupur Sharma: నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకు యువకుడిపై దాడి.. 8 మంది నిందితుల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nupur Sharma-Prophet row: దేశంలో సంచలనం రేపిన నుపుర్ శర్మ వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. నుపుర్ శర్మకు మద్దతు తెలిపారనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు ఇతరులపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రెండు హత్యలు కూడా జరిగాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దాడి జరిగింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకు కొంతమంది వ్యక్తులు ఆయుష్ జాదవ్ (25) అనే భజరంగ్ దళ్ కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం బాధితుడు ఆయుష్ జాదవ్ మోటర్ సైకిల్ పై వెళ్తున్న క్రమంలో అడ్డగించి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయుష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.
ఈ దాడిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు నేషనల్ సెక్యురిటీ యాక్ట్ కేసులను ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేశారు. మొత్తం ఈ ఘటనలో 13 మంది పాల్గొనగా.. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగిలిన ఐదుగురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. మధ్యప్రదేశ్ లో శాంతి భద్రలకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 307 (హత్య ప్రయత్నం), 506 (నేరపూరిత బెదిరింపు) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
Also Read
- India summons US: అమెరికా దాడులపై భారత్ సీరియస్.. యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు..
- Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
- Jaishankar: యూరప్ అహంకారంపై భారత్ దెబ్బ.. జైశంకర్ సమాధానంతో సైలెంట్..
- Congress: "అఖండ కాంగ్రెస్".. విలీనం దిశగా టీఎంసీ, ఎన్సీపీ..
Read Also: National Herald Case: ఈడీ పేరిట సోనియా గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంలో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. దీని తరువాత కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నుపుర్ శర్మకు సోషల్ మీడియాలో మద్దతు తెలపిన కారణంగా ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ ను అత్యంత కిరాతకంగా ఇద్దరు మతోన్మాదులు తల నరికి హత్య చేశారు. ఈ ఘటనకు ముందే మహరాష్ట్ర అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని కూడా దారుణంగా హత్య చేశారు. తాజాగా జరిగిన ఘటనపై అగర్ మాల్వా జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హిందూ గ్రూపులు ఎస్పీ కార్యాలయం ముందు నిందితులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.
తాజావార్తలు
-
Stock Market: యుద్ధం ముగింపు వార్తలతో.. భారీ లాభాల్లోకి వెళ్లిన స్టాక్ మార్కెట్లు..
-
India summons US: అమెరికా దాడులపై భారత్ సీరియస్.. యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు..
-
VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
-
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్కు స్టార్ ప్లేయర్ గుడ్బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్కు ముగింపు
-
Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!