G20 Summit: “ప్రెసిడెంట్ ఆఫ్ భారత్”.. వివాదం అవుతున్న రాష్ట్రపతి ఆహ్వానం..
G20 Summit: సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సదస్సు జరగబోతోంది. అయితే ఈ సమావేశానికి హాజరయ్యే దేశాధినేతలకు విందు ఇచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ఈ ఆహ్వానమే వివాదాస్పదం అవుతోంది. సాధారణంగా రాష్ట్రపతి ఆహ్వానంలో ‘‘ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’ అని ఉంటుంది. అయితే ఈ ఆహ్వానంలో మాత్రం ‘‘ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’గా ఉంది. ఇప్పుడు ఇదే కొత్త రచ్చకు కారణమవుతోంది. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి జీ20 దేశాధినేతలను విందుకు ఆహ్వానించారు. అంతర్జాతీయ వేదికపై ఇండియా పేరుకు బదులు భారత్ అనే పేరును బలంగా వినిపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
ఏ అధికారిక కార్యక్రమానికైనా ఇలా భారత్ అని మార్చడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. భారత్ అనే పదం రాజ్యాంగంలో కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇండియా అంటే భారత్ రాష్ట్రాల యూనియన్ అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 పేర్కొంటుంది. మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వసర్మ ‘‘రిపబ్లిక్ ఆఫ్ భారత్-మన నాగరికత అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా మరియు గర్వంగా ఉంది’’ అంటూ ట్వీట్ చేశారు.
Also Read
Read Also: Russia: పుతిన్, కిమ్ సమావేశం.. ఆయుధాల డీల్ కోసమే..
ఇదిలా ఉంటే ఈ చర్యను అధికార బీజేపీ పార్టీ స్వాగతిస్తుండగా.. విపక్షాలు మాత్రం దీనిపై విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ చర్యను విమర్శించారు. ‘‘కాబట్టి ఆ వార్త నిజం.. జీ20 డిన్నర్ కి రాష్ట్రపతి పంపిన ఆహ్వానంలో ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’ బదులు ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’ అని ఉందని ’ఆయన ట్వీట్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ఇండియా, భారత్-యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని, కానీ రాష్ట్రాల యూనియన్ ఇప్పుడు దాడికి గురవుతోందని ఆయన ఆరోపించారు.
మరోవైపు ఇండియా పేరును భారత్ గా కేంద్రం మారుస్తుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఆహ్వానం చర్చనీయాంశం అయింది. అంతకు ముందు బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ సంస్థ చీఫ్ మోహన్ భగవన్ మాట్లాడుతూ.. దేశాన్ని ఇండియాకు బదులు భారత్ గా పిలువాలంటూ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష కూటమి ఇండియా అనే పేరు పెట్టుకున్న తర్వాత భారత్ వర్సెస్ ఇండియాల మధ్య చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో